ఆషాడమాసంలో కొత్తగా పెళ్లయిన వధువు పుట్టింటికి ఎందుకు వెళ్తుందో తెలుసా?

July 10, 2021 11:51 AM

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వచ్చే నెలకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు మాసాలలో నాలుగవ మాసమైన ఆషాడ మాసానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఆషాడ మాసంలో ఏ శుభకార్యాలు చేయరు.అదేవిధంగా ఆషాడమాసం రాగానే కొత్తగా పెళ్లయిన వధువు అత్తవారింట ఇంటికి చేరుతుంది .అయితే ఈ విధంగా ఆషాఢ మాసంలోనే నవ వధువు ఇంటికి వెళ్ళడానికి గల కారణమేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

కొత్తగా పెళ్లైన వధూవరులు ఆషాడమాసంలో దూరంగా ఉండటానికి గల కారణం ఏమిటంటే… ఆషాడమాసంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే అందరూ పొలం పనులలో నిమగ్నమవుతారు. ఇలాంటి సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అల్లుడికి మర్యాదలు చేయడం కుదరదు కనుక కొత్తగా పెళ్లయిన వారినీ దూరంగా ఉంచుతారు.

అదేవిధంగా ఆషాడమాసంలో ఈదురు గాలులు, వర్షాలు కారణంగా గాలి కాలుష్యం నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే అది పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని భావిస్తారు అందుకోసమే కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరం పెడతారు.ఒకవేళ ఆషాడ మాసంలో గర్భం దాల్చితే వారు చైత్రమాసంలో బిడ్డకు జన్మనీస్తారు కనుక అప్పుడు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదని ఈ నెల మొత్తం కొత్తగా పెళ్లైన జంట దూరంగా ఉండాలని చెబుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment