Marriage : ఇద్దరు మనుషులను ఒకటిగా చేసే వేడుకే వివాహం. అప్పటివరకు వేరువేరుగా ఉన్న స్త్రీ పురుషులను దంపతులుగా కలపడమే వివాహలక్ష్యం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు ఏ పరిచయం లేకపోయినా పెళ్లిచేసుకున్నాక వారి మధ్య ప్రేమ చిగురించేంతటి మహత్తు వివాహబంధానికి ఉంది. సహజీవనం, కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చి వివాహ బంధానికి బీటలు పడ్డాయని చెప్పొచ్చు. మారిన జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితంలో బంధాల కంటే ఎక్కువగా కెరీర్లో ఎదగడానికి ప్రిపేర్ చేయడం.. పెళ్లెందుకు.. అవసరమా అనే ఆలోచనా ధోరణిలో నేటి యువత ఉంది. పెళ్లెందుకు అనే ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
ప్రతీ మనిషీ మూడు రుణాలతో పుడతాడు.1. రుషి రుణం 2. దేవ రుణం 3.పితృ రుణం. ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ రుణాలను తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు రుణ విముక్తుడు కావాలి. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెబుతున్నది. 1. రుషి రుణం – బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేసి బ్రహ్మచర్యం ద్వారా రుషి రుణం తీర్చాలి. పురాణాలను అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి.
దేవ రుణం – నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ మనమెంతో రుణపడి వున్నాం. కనుక ఆ రుణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నులం అవుతాం. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాల వల్ల దేవతలు తృప్తి చెందుతారు. యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. . దీనివలన సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి.
3. పితృ రుణం – తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా. ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః అంటుంది వేదం. అంటే వంశ పరంపరను తెంచవద్దు. ఇలా ఈ 3 కారణాల కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…