మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లి అయిన తర్వాత మహిళలు తన భర్త జీవించి ఉన్నంతకాలం మెడలో మంగళసూత్రం ధరించి ఉంటారు. ఈ విధంగా మంగళసూత్ర భర్త ఆయుష్షును సూచిస్తుందని చెప్పవచ్చు.ఈ విధంగా పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించే మహిళలు మంగళసూత్రంతో పాటు కొన్ని ఎర్రటి, నల్లని పూసలను కూడా ధరిస్తారు. అదేవిధంగా మరికొందరు మహిళలు మంగళసూత్రంతో పాటు లక్ష్మీ బొట్టు కూడా ధరిస్తుంటారు. ఈ విధంగా పూసలు ధరించేటప్పుడు మంగళసూత్రంలో ఎన్ని ఉండాలి అనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి.
మంగళసూత్రంలో ఈ విధంగా ఎర్ర, నల్లపూసలను ధరించేవారు మొత్తం తాళితో సహా తొమ్మిది ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అదేవిధంగా తాళిని మరికొందరు తీసేసి పడుకోవడం చేస్తుంటారు. ఆ విధంగా తాళిని ఎట్టి పరిస్థితులలో తీయకూడదు. అలాగే ఒకవేళ మంగళ సూత్రం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మెడలో పసుపు కొమ్మ కట్టుకొని తాళిని మార్చుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా తాళిని మార్చుకోవాలి అనుకునేవారు మంగళ, శుక్రవారాలలో ఎలాంటి పరిస్థితులలో కూడా మార్చుకోకూడదు. ఈ విధంగా మార్చడం వల్ల పుణ్య స్త్రీ కి మంచిది కాదని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రానికి ప్రతిరోజూ పూజ తరువాత పసుపు కుంకుమ పెట్టుకోవడం ద్వారా తన భర్త ఆయుష్షు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా మంగళసూత్రం ధరించే మహిళలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…