కన్న కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని కోపంతో తల్లిదండ్రులే ఆమె పాలిట మృత్యువుగా మారారు. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని చేసుకోవడంలేదని ఆ యువతి పట్ల ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్న తల్లిదండ్రులే ఏమాత్రం కడుపుతీపి లేకుండా తనపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
రాయచోటి సీఐ జి.రాజు కథనం మేరకు స్థానికంగా ఉన్న ఓ యువతి ఓ యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తనకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విధంగా వచ్చిన సంబంధాలు అన్నింటినీ యువతిచెడుకొట్టడంతో పాటు తనకు తాను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని తమ తల్లిదండ్రులతో వాదనకు దిగింది.
ఈ విధంగా మంగళవారం రాత్రి మరోసారి తండ్రీ కూతుళ్ల మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో వీరిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ యువతి తల్లిదండ్రులు, సోదరుడు యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆ సమయంలోనే యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మంటలను అదుపు చేసి ఆమెను చికిత్స కోసం రిమ్స్ కి తరలించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల పై పోలీస్ కేసు ఫిర్యాదు చేసి విచారణ జరుపుతున్నట్లు సిఐ రాజు తెలియజేశారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…