Marriage : ఒక పెళ్లితో రెండు కుటుంబాలు, రెండు మనసులు ఏకమవుతాయి. పెళ్లి అంటే చాలా ఉంటాయి. పద్దతి ప్రకారం తంతులని జరుపుతారు. పెళ్లిలో ఎన్నో తంతులు ఉంటాయి. తలంబ్రాలు, మాంగళ్యధారణ, సుముహూర్తం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఇలా ఎన్నో. అయితే చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే, పెళ్లిలో ఎందుకు మూడు ముళ్ళు వెయ్యాలి..? మూడే ముళ్ళు ఎందుకు వేయాలి, మూడుకి ఎందుకు అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు..? మరి ఇక ఈ విషయాన్నే చూద్దాం.
ప్రాచీన కాలం నుండి కూడా, మూడుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుళ్ళకి సంబంధించి చూస్తే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు. అలానే సృష్టి పరంగా చూసినట్లయితే సృష్టి, స్థితి, లయలు మూడు. ఆధ్యాత్మికపరంగా చూసుకున్నట్లయితే, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శాంతులు మూడు. యాగానికి కావాల్సిన ఆగ్నలు కూడా మూడు.
అలానే తాంబూలంలో ఆకు, వక్క, సున్నం మూడు. యజ్ఞోపవీతంలో పోగులు మూడు. ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు. బ్రహ్మ సూత్రంలోని ముడులు కూడా మూడు. ధర్మ, అర్ధ, కామము అనే మూడింటితో మోక్షాన్ని పొందొచ్చు. మంగళసూత్రపు పేటలు మూడు. ముడులు కూడా మూడు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు శరీరాలు ఉంటాయి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు.
మాంసం, రక్తం, ఎముకలు ఈ మూడింటినీ కూడా శరీరం కప్పుతుంది. ఇలా మనిషికి మూడు శరీరాలు ఉన్నాయి. కనుక మూడు శరీరాలకు కూడా మూడు ముడులు వేస్తారు. అందుకే వివాహం సమయంలో వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది. ఎప్పటి నుండో కూడా ఇలా వివాహ పద్ధతులని మన పూర్వీకులు పాటిస్తున్నారు. వాళ్ళు పాటించినవి ఇప్పుడు మనము కూడా పాటిస్తున్నాం. ఈ పురాతన పద్ధతులని మనమే రాబోయే తరాల వాళ్లకి కూడా చెప్పాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…