సాధారణంగా హిందువులు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా పూజలో ఉపయోగించే వాటిలో పువ్వులు ముందు వరుసలో ఉంటాయి. పువ్వులు లేకుండా ఎవరు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు. పూజలో పువ్వులకు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే పూజకు తప్పనిసరిగా పువ్వులు అవసరమా ? పూజలో పువ్వులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ చేసే సమయంలో ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో స్వామివారికి పుష్పం లేదా ఫలం లేదా నీటిని సమర్పిస్తారో వారి నైవేద్యాన్ని భగవంతుడు తృప్తి చెంది స్వీకరిస్తాడని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు. ఈ క్రమంలోనే భగవంతుడిని పూజించే వారు నిష్కల్మషమైన మనసుతో పూజ చేయటం వల్ల భగవంతుడు వారి వెన్నంటే ఉండి కాపాడుతాడు. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడు తన అర్చనలో భాగంగా పూలను చేర్చాడంటే పూజలో పువ్వులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది.
స్వామివారి పూజకు ఉపయోగించే పుష్పాలు ఎంతో శుభ్రమైనవి, సువాసన భరితమైనవి అయ్యుండాలి. పూజకు ఉపయోగించే పూలను పురిటివారు, మైలవారు, బహిష్టులైన స్త్రీలు తాకకూడదు. అలాంటి వారు తాకిన పుష్పాలను పూజకు ఉపయోగించకూడదు. అదేవిధంగా కింద పడిన పువ్వులు, ముళ్ళు కలిగిన పువ్వులు, దుర్గంధ భరితమైన వాసన వెదజల్లే పుష్పాలను కూడా పూజకు ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…