పూజకు పువ్వులను తప్పనిసరిగా ఉపయోగించాలి.. ఎందుకో తెలుసా ?

March 3, 2022 7:53 PM

సాధారణంగా హిందువులు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా పూజలో ఉపయోగించే వాటిలో పువ్వులు ముందు వరుసలో ఉంటాయి. పువ్వులు లేకుండా ఎవరు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు. పూజలో పువ్వులకు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే పూజకు తప్పనిసరిగా పువ్వులు అవసరమా ? పూజలో పువ్వులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పూజ చేసే సమయంలో ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో స్వామివారికి పుష్పం లేదా ఫలం లేదా నీటిని సమర్పిస్తారో వారి నైవేద్యాన్ని భగవంతుడు తృప్తి చెంది స్వీకరిస్తాడని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు. ఈ క్రమంలోనే భగవంతుడిని పూజించే వారు నిష్కల్మషమైన మనసుతో పూజ చేయటం వల్ల భగవంతుడు వారి వెన్నంటే ఉండి కాపాడుతాడు. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడు తన అర్చనలో భాగంగా పూలను చేర్చాడంటే పూజలో పువ్వులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది.

స్వామివారి పూజకు ఉపయోగించే పుష్పాలు ఎంతో శుభ్రమైనవి, సువాసన భరితమైనవి అయ్యుండాలి. పూజకు ఉపయోగించే పూలను పురిటివారు, మైలవారు, బహిష్టులైన స్త్రీలు తాకకూడదు. అలాంటి వారు తాకిన పుష్పాలను పూజకు ఉపయోగించకూడదు. అదేవిధంగా కింద పడిన పువ్వులు, ముళ్ళు కలిగిన పువ్వులు, దుర్గంధ భరితమైన వాసన వెదజల్లే పుష్పాలను కూడా పూజకు ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment