Srisailam : చాలామంది శ్రీశైల ఆలయానికి వెళుతుంటారు. శ్రీశైలం గురించి, శ్రీశైల మహిమ గురించి చెప్పే కొద్ది ఎన్నో విషయాలు చెబుతూనే ఉండాలి. దీని దివ్య శక్తి ఎంతో అమోఘం. భౌతిక ఇంద్రియాలతో చూడలేని దివ్యత్వం ఈ ఆలయంలో ఉంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే ఈ ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ విషయం స్కాంద పురాణంలోని శ్రీశైల కాండలో ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే, ఎలాంటి భాగ్యం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
చైత్రమాసంలో శ్రీశైలం లో ఉండే ఈ మహిమగల ఆలయాన్ని దర్శించుకుంటే, సకల శుభాలు కలుగుతాయి. బహు యజ్ఞాలు ఆచరించిన ఫలితం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. వైశాఖ మాసంలో ఈ ఆలయానికి వెళితే కష్టాలు తీరిపోతాయి. లక్ష గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది. జేష్ఠ మాసంలో ఇక్కడికి వెళితే లగోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలితం లభిస్తుంది. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడికి ఆషాడ మాసంలో వెళితే బంగారు రాశులని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. కోటి గోవుల్ని శివాలయానికి దానమిచ్చినంత పుణ్యం పొందుతారు.
శ్రావణ మాసంలో ఈ ఆలయానికి వెళితే యోజనం పొలమును పంటతో పాటు, పండితునికి దానం చేసినంత గొప్ప ఫలితం మీకు కలుగుతుంది. భాద్రపద మాసంలో ఈ ఆలయానికి వెళితే కోటి కపిల గోవులను పండితులకు దానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. ఆశ్వయుజ మాసంలో ఇక్కడికి వెళితే, వెయ్యి కన్యాదానాలు చేసినంత ఫలితం కలుగుతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలో ఇక్కడికి వెళితే వాజపేయ యాగాలు చేసినంత ఫలితాన్ని పొందొచ్చు. యజ్ఞాలలో అన్నిటికంటే ఇది చాలా గొప్పది.
మార్గశిరమాసంలో ఇక్కడికి వెళితే పౌండరీక యాగం చేసినంత ఫలం మీకు కలుగుతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. పుష్య మాసంలో వెళితే మోక్షం లభిస్తుంది. పాపాలన్నీ పోతాయి. మాఘమాసంలో ఇక్కడికి వెళితే శ్రేయస్సు కలుగుతుంది. రాజసూయ యాగం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో ఇక్కడికి వెళితే తరగని సంపదని పొందొచ్చు. సౌతామణి యాగఫలం కూడా మీకు కలుగుతుంది. ఎనలేని పుణ్యాన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…