Srisailam : చాలామంది శ్రీశైల ఆలయానికి వెళుతుంటారు. శ్రీశైలం గురించి, శ్రీశైల మహిమ గురించి చెప్పే కొద్ది ఎన్నో విషయాలు చెబుతూనే ఉండాలి. దీని దివ్య శక్తి ఎంతో అమోఘం. భౌతిక ఇంద్రియాలతో చూడలేని దివ్యత్వం ఈ ఆలయంలో ఉంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే ఈ ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ విషయం స్కాంద పురాణంలోని శ్రీశైల కాండలో ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే, ఎలాంటి భాగ్యం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
చైత్రమాసంలో శ్రీశైలం లో ఉండే ఈ మహిమగల ఆలయాన్ని దర్శించుకుంటే, సకల శుభాలు కలుగుతాయి. బహు యజ్ఞాలు ఆచరించిన ఫలితం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. వైశాఖ మాసంలో ఈ ఆలయానికి వెళితే కష్టాలు తీరిపోతాయి. లక్ష గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది. జేష్ఠ మాసంలో ఇక్కడికి వెళితే లగోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలితం లభిస్తుంది. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడికి ఆషాడ మాసంలో వెళితే బంగారు రాశులని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. కోటి గోవుల్ని శివాలయానికి దానమిచ్చినంత పుణ్యం పొందుతారు.
శ్రావణ మాసంలో ఈ ఆలయానికి వెళితే యోజనం పొలమును పంటతో పాటు, పండితునికి దానం చేసినంత గొప్ప ఫలితం మీకు కలుగుతుంది. భాద్రపద మాసంలో ఈ ఆలయానికి వెళితే కోటి కపిల గోవులను పండితులకు దానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. ఆశ్వయుజ మాసంలో ఇక్కడికి వెళితే, వెయ్యి కన్యాదానాలు చేసినంత ఫలితం కలుగుతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలో ఇక్కడికి వెళితే వాజపేయ యాగాలు చేసినంత ఫలితాన్ని పొందొచ్చు. యజ్ఞాలలో అన్నిటికంటే ఇది చాలా గొప్పది.
మార్గశిరమాసంలో ఇక్కడికి వెళితే పౌండరీక యాగం చేసినంత ఫలం మీకు కలుగుతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. పుష్య మాసంలో వెళితే మోక్షం లభిస్తుంది. పాపాలన్నీ పోతాయి. మాఘమాసంలో ఇక్కడికి వెళితే శ్రేయస్సు కలుగుతుంది. రాజసూయ యాగం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో ఇక్కడికి వెళితే తరగని సంపదని పొందొచ్చు. సౌతామణి యాగఫలం కూడా మీకు కలుగుతుంది. ఎనలేని పుణ్యాన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…