నిద్రపోతే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే నిద్రకి ముందు అలానే నిద్రలేచిన తర్వాత దేవుడిని స్మరిస్తే, చక్కటి శాంతి మనకి లభిస్తుంది. శారీరిక, మానసిక ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉంటాము. అన్ని జీవులు కూడా నిద్రపోతూ ఉంటాయి. అయితే దైవాన్ని నమ్మే ప్రతి మనిషి కూడా నిద్రపోవడానికి ముందు, నిద్ర లేవగానే దైవాన్ని స్మరించాలి. ఏ పని చేసినా కూడా మనం దైవనామస్మరణ చేయాలి.
దీనివలన శాంతి లభిస్తుంది. మానసిక, శారీరక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇక ఏ దేవుళ్ళని స్మరించుకోవాలి అనే విషయానికి వచ్చేద్దాం.. నిద్రించే ముందు శివుడిని స్మరించుకుంటే, చాలా మంచిది. ఓం నమశ్శివాయ అని శివుడిని ధ్యానిస్తూ నిద్రలోకి వెళ్లాలి. శివుడు లయకారుడు. శివుడిని స్మరిస్తూ, నిద్రలోకి వెళ్తే.. పీడకలలు ఏమీ కూడా రావు. హాయిగా నిద్రపోవచ్చు. అదే విధంగా నిద్రలేచిన వెంటనే, మనసులో విష్ణు నామాన్ని స్మరించుకోవాలి.
విష్ణువు అంటే స్థితికారుడు. మనల్ని రోజంతా క్షేమంగా, ఆనందంగా విష్ణువు ఉంచుతాడు. కనుక విష్ణువుని స్మరిస్తూ మేల్కొనడం మంచిదని పండితులు అంటున్నారు. ఏదో ఒక విష్ణు మంత్రాన్ని జపిస్తూ నిద్రలేస్తే చాలా మంచి జరుగుతుంది. నారాయణుడు మనల్ని రోజంతా భద్రంగా కాపాడుతాడు. నిద్ర మేల్కొన్న తర్వాత కళ్ళు తెరిచే ముందు రెండు అరచేతులు రాపిడి చేసుకోవాలి.
తర్వాత కళ్ళ మీద చేతులతో అద్దుకోవాలి. ఆ తర్వాత అరచేతుల్లోకి చూసుకుంటూ, కళ్ళు విప్పాలి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవులు కొలువై ఉంటారు. ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉండొచ్చు. చూశారు కదా నిద్రకి ముందు, నిద్రలేచిన తర్వాత ఏం చేయాలో.. మరి ఇక ఈ విధంగా పాటించి, ప్రశాంతంగా ఉండండి. రోజంతా కూడా సంతోషంగా ఉండండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…