Gods : హిందువుల్లో చాలా మంది భక్తులు తమ ఇష్టానికి అనుగుణంగా తమ తమ ఇష్ట దైవాలకు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఉదయం పూజ చేస్తే కొందరు సాయంత్రం పూట, ఇంకా కొందరు రెండు వేళల్లోనూ పూజలు చేస్తారు. అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం ఏ దేవున్నయినా, దేవతనైనా పలు నిర్దిష్ట సమయాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్రహం ఇంకా ఎక్కువ లభిస్తుందట. ఈ క్రమంలో ఏయే దేవుళ్లను ఏయే వేళల్లో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య భగవానున్ని ఉదయం 4.30 నుంచి 6 గంటలలోగా పూజించాలి. ఈ సమయంలో శ్రీరాముడు, వెంకటేశ్వరులను కూడా పూజించవచ్చు. ఇలా చేయడం వల్ల వారి అనుగ్రహం మిక్కిలిగా లభిస్తుంది. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య మహాశివున్ని పూజించాలట. ఆయనతోపాటు దుర్గాదేవిని కూడా పూజించవచ్చట. అలా చేస్తే అనుకున్నవి నెరవేరుతాయట. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆంజనేయ స్వామిని పూజించాలట. ఆయన కృపకు మరింత పాత్రులు కావాలంటే ఆ సమయమే మంచిదని పండితులు చెబుతున్నారు.
నవగ్రహాల్లో ఒకటైన రాహువును మధ్యాహ్నం 3 గంటలకు పూజించాలట. దీంతో ఎక్కువ ఫలితం లభిస్తుందట. సాయంత్రం 6 గంటల సమయంలోనూ శివున్ని పూజించవచ్చట. రాత్రి 6 నుంచి 9 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలట. దీంతో ఆమె కరుణా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయట. ధనం బాగా కలుగుతుందట. ఐశ్వర్యవంతులవుతారట. తెల్లవారు జామున 3 గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంఠ వాసుడి దయ అపారంగా లభిస్తుందట. ఆయన అనుగ్రహం పొందాలంటే ఆ సమయంలో పూజ చేయాలట. సాధారణంగా ఏ దేవుడు లేదా దేవతకైనా ఎప్పుడైనా పూజ చేయవచ్చు. అయితే పైన చెప్పిన ప్రకారం పూజ చేస్తే మిక్కిలి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…