Lord Ganesha : ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుతారు. పెద్ద పెద్ద మండపాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. వినాయక చవితి పూజలో ఇవి తప్పనిసరి అని గుర్తు పెట్టుకోండి.
గణపతి విగ్రహాన్ని మండపాల్లో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంతా రెడీ చేస్తున్నారు. పది రోజుల పాటు వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. వినాయక విగ్రహాన్ని చతుర్దశి రోజున.. ప్రవహిస్తున్న నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12: 39 గంటల నుండి చవితి తిథి మొదలవుతుంది. సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8 గంటలకి ముగిస్తుంది. చాంద్రమానం ప్రకారం తెలుగు వాళ్ళు గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలని పండితులు చెప్పారు.
వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. వినాయకుడికి కచ్చితంగా గరికను పెట్టి పూజించండి. అంతా శుభమే జరుగుతుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు ఇష్టం. నైవేద్యంగా ఈ రెండిటిని కచ్చితంగా పెట్టండి. ఈ రెండు పెట్టి మీరు ఇంకేమైనా నైవేద్యాలని పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. కానీ ఈ రెండు అంటే మాత్రం వినాయకుడికి ఎంతో ప్రీతి.
గణేషుడి పూజలో ఎర్రని పూలను ఉపయోగించండి. ఎర్రని మందారాలు వంటివి వాడొచ్చు. ఎర్రటి గులాబీ పూలను కూడా పెట్టొచ్చు. వినాయకుడి అలంకరణలో సింధూరం కూడా ఒకటి. వినాయకుడిని పూజించేటప్పుడు సింధూర తిలకాన్ని దిద్దండి. వడపప్పు, పానకం, చలిమిడి తప్పక పెట్టండి. పూజ సమయంలో నైవేద్యంగా వీటిని వినాయకుడికి సమర్పిస్తే వినాయకుని అనుగ్రహం ఉంటుంది.
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ…
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి…
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…