శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం వల్ల అమ్మవారి కృప ఎల్లవేళలా మనపై ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే వరలక్ష్మీ వ్రతం రోజు పెద్ద ఎత్తున మహిళలు ఉపవాసాలు ఉండి అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ చేసి వివిధ రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించి ఈ వ్రతం ఆచరిస్తారు. మరి ఎంతో పవిత్రమైన ఈ వ్రతం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేయాలి ? ఏ పనులు చేయకూడదు ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
* వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళలు తప్పనిసరిగా ఉపవాసంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.
* అమ్మవారి పూజ చేస్తున్నంత సేపు మనసు మొత్తం అమ్మవారిపై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది.
* వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వరలక్ష్మీ వ్రత కథ వినడం, చదవడం చేయాలి.
* అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.
* పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి వాయనం ఇవ్వడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి.
* అమ్మవారికి వ్రతం చేయాలనుకునే వారు 2 రోజులపాటు శారీరక కలయికకు దూరంగా ఉండాలి.
* పూజ చేస్తున్నంత సేపు మన మనసును ఇతర అంశాలపై మళ్లించరాదు. మనసును అమ్మవారిపై ఉంచి భక్తితో పూజ చేసినప్పుడే ఫలితం ఉంటుంది.
* ఒకవేళ అమ్మవారి వ్రతం మనం ఆచరించక పోయినా ఇతరుల ఇంటికి వెళ్లేవారు మాంసాహారాన్ని ముట్టుకుని, తిని వెళ్ళకూడదు.
* బిడ్డకు జన్మనిచ్చి 22 రోజులు పూర్తి కాని వారు ఈ వ్రతంలో పాల్గొనకూడదు, ఈ వ్రతం చేయకూడదు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…