Twin Banana : అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి పండ్లను తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి. అరటి పండ్లను అందుకే చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అరటి పండ్లను పూజకి కూడా వాడుతూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని సార్లు రెండు అరటి పండ్లు అతుక్కుని ఉంటాయి. వాటిని జంట అరటి పండ్లు అని పిలుస్తాము. చాలా మంది ఈ అరటి పండ్లను తినకూడదని, ఇలా ఈ అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని అంటూ ఉంటారు. ఇలా అంటారు కనుక చాలామంది ఇటువంటి అరటి పండ్లను తీసుకోరు.
అయితే అసలు జంట అరటి పండ్లను తీసుకోవచ్చా..?, తీసుకోకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి నిజంగా జంట అరటి పండ్లను తినొచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కవల అరటి పండ్లని పిల్లలు తినకూడదు. పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు. అలాగే దేవుడికి కూడా ఇటువంటి అరటి పండ్లను పెట్టకూడదని అంటూ ఉంటారు. అరటి చెట్టు అంటే ఎవరో కాదు. సాక్షాత్తూ దేవ నర్తకి రంభ అవతారం.
మహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని, అహంకారపూరితంగా వ్యవహరించడం వలన ఆమెని భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపిస్తాడు. రంభ తన తప్పును తెలుసుకుని ప్రాధేయపడడంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతని ఆమెకి ఇచ్చాడు. అంత పవిత్రమైన అరటిపండ్లలో ఎటువంటి దోషాలని కూడా ఎంచక్కర్లేదు.
కవల అరటి పండ్లను దేవతలకి పెట్టొచ్చు. అందులో తప్పులేదు. కానీ తాంబూలంలో మాత్రం ఇటువంటి అరటి పండ్లను పెట్టకూడదు. ఎందుకంటే ఇవి రెండు పండ్లు అయినా కూడా ఒక పండు కిందే లెక్క వస్తాయి. పైగా చాలా మంది కవల పిల్లలు పుడతారని మంచిది కాదని అంటూ ఉంటారు. అటువంటప్పుడు మనం పెట్టడం వలన ఇతరులకి నచ్చకపోవచ్చు. కాబట్టి తాంబూలంలో పెట్టకుండా ఉండడమే మంచిది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…