Tirumala Hills : ఎంతో మంది ప్రతి సంవత్సరం కూడా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న కలియుగ వైకుంఠం తిరుమల. తిరుమల గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. సప్తగిరులపై వెలసిన కలియుగ వైకుంఠ పురి తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిలయము ఈ తిరుమల. తిరుమలలో ప్రతి శిలా చింతామణి. ప్రతి చెట్టు, ప్రతి తీగ మహర్షులు అంటారు.
అలానే, ప్రతి తీర్థం దేవగంగ స్వరూపాలని వెంకటాచల మహత్యంలో చెప్పబడింది. స్వామివారి ప్రధానాలయానికి దగ్గర ఉండే స్వామి పుష్కరిణి చాలా పవిత్రమైనది. స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ పుష్కరిణిలో స్నానం చేశారని చెప్పబడింది. స్వామివారిని దర్శించే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్లడం ఆచారం. ఈ తీర్థం దగ్గర గోదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ ప్రధాన ఆలయం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగ తీర్థం ఉంది.
ఇది శ్రీవారి పాద పద్మముల నుండి ఉద్భవించింది. ఆకాశగంగలో స్నానం చేస్తే, 100 పుణ్య కార్యాలు చేసినంత ఫలితం దక్కుతుంది, ఆలయానికి మూడు మైళ్ళ దూరంలో పాప వినాశనము ఉంది. ఇక్కడ స్నానం చేస్తే, సకల పాపాలు పోతాయి. పాప వినాశానికి వెళ్లే దారిలో జాబాలీ తీర్థం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది.
జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేస్తే, ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారని చెప్తారు. ఆలయానికి 16 కిలోమీటర్ల దూరంలో, తుంగర తీర్థం ఉంది. ఇక్కడ స్నానం చేస్తే కూడా కష్టాలు తొలగిపోతాయి. పాండవ తీర్థం కూడా ఇక్కడ ఉంది. అనుకున్న పనులు ఇక్కడ స్నానం చేస్తే పూర్తవుతాయట. కుమారధార తీర్థం, చక్రతీర్థం, నాగ తీర్థం, శేష తీర్థం కూడా ఉన్నాయి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు, వీటిని మర్చిపోకుండా సందర్శించి, ఇక్కడ చెప్పినట్టు ఆచరించి, కష్టాల నుండి బయటకి వచ్చేయండి.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…