Kaliyugam : మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలుసు. మొదటి యుగమైన సత్యయుగంలో, ధర్మం నాలుగు పాదాలు మీద నడిచింది. రెండో యుగమైన త్రేతాయుగంలో, ధర్మం మూడు పాదాల మీద నడిస్తే, మూడవ యుగం ద్వాపర యుగంలో రెండు పాదాల మీద నడిచింది. ప్రస్తుతం కలియుగంలో ధర్మం అనే మాటలకి ఇప్పుడు చోటే లేదు. సత్య యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. 17 లక్షల 28 వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క కాల పరిమాణం. ధర్మం నాలుగు పాదాలు మీద నడిచిందని శివపురాణంలో చెప్పబడింది. ఈ యుగంలో ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు లేకుండా ప్రజలు జీవించేవారు.
అసలు అకాల మరణాలే లేవు. కృత యుగానికి రాజు సూర్యుడు. మంత్రి గురువు అధిపతి కావడంతో అంతా బంగారమయం. ప్రభువుకి, ప్రజలకి మధ్య ఎలాంటి విభేదం ఉండేది కాదు. విరోధం లేకుండా చక్కగా రోజులు నడిచేవట. ఇక త్రేత యుగంలో, శ్రీరామచంద్రుడుగా భగవంతుడు అవతరించి రావణాసురుడుని సంహరించి, ధర్మసంస్థాపన చేశాడు. 12 లక్షల 96 వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క పరిమితి. త్రేతా యుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు. యుద్ధ ప్రియుడు.
రాజుగా ఆచారాలకి కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. మంత్రులు క్రూర స్వభావులై, రాజపాలనని బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి, దైవ కార్యాలు నిర్వహించే వంశాలని అంతరించేలా చేసారు. ఇక ద్వాపరయుగం విషయానికి వస్తే, శ్రీకృష్ణుడిగా శ్రీమహావిష్ణువు అవతరించాడు. ఎనిమిది లక్షల 64 వేల సంవత్సరాలు ఈ కాల పరిమాణం. చంద్రుడు రాజుగా, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడికి, బుధుడుకి ఒకరంటే ఒకరికి పడదు. దేవతా కార్యాలని సగానికి సగం నాశనం చేశారు.
ఇలా ద్వాపరయుగంలో ధర్మం రెండు భాగాలుగా నశించి, కలియుగం వచ్చింది. కలియుగం కాలపరిమితి నాలుగు లక్షల 32000 సంవత్సరాలు. సుమారు 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు. మంత్రులు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగంలో అసత్యం, క్రూరత్వం, అధర్మం, అన్యాయం తలెత్తుతాయి. దైవభక్తి తగ్గుతుంది. హింస సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం అనే భయం పోతుంది. స్త్రీని, ధనాన్ని పొందిన వాడే గొప్పవాడని అనుకునే రోజులు వస్తాయి. అధర్మం బాగా పెరుగుతుంది. కలియుగంలో మంచి అనే మాటకి చోటే ఉండదు. అధర్మం వైపు అందరూ ఆసక్తి చూపుతారు అని శివపురాణం లో చెప్పబడింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…