ప్రస్తుతం మనిషికి డబ్బు ఎంత ఆవశ్యకంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు లేకపోతే మనిషి ఉండలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది.. అనడంలో అతిశయోక్తి లేదు. అయితే డబ్బు విషయానికి వస్తే మనలో కొందరు ప్రవాహంలా డబ్బు సంపాదిస్తుంటారు. కొందరు సంపాదించలేకపోతుంటారు. కానీ మార్వాడీలు మాత్రం బిజినెస్లు బాగా చేస్తుంటారు. వారు కోట్ల రూపాయలను వెనకేస్తుంటారు. మనం ఎక్కడ చూసినా సరే మార్వాడీల బిజినెస్లు మంచి లాభాల్లో ఉంటాయి. అయితే లక్ష్మీ దేవి వారినే ఎందుకు కటాక్షిస్తుంది.. వారు అంతలా డబ్బు ఎలా సంపాదిస్తున్నారు.. వారు చేసే రహస్య పూజా విధానం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మార్వాడీలు లక్ష్మీ కటాక్షం కోసం ప్రత్యేకంగా రహస్య పూజలు చేస్తుంటారు. వారు చేసే పూజలు ఎదుటి వారికి కనిపించవు. కనుకనే లక్ష్మీదేవి వారిని వరిస్తుంది. మార్వాడీలు గుర్రపు నాడాను దోషాలు పోవడానికి ఉపయోగిస్తారు. వీటిని షాపుల్లో, ఇంటి ప్రధాన ద్వారం వద్ద బయట లేదా లోపల ఎవరికీ కనిపించకుండా వేలాడదీస్తారు. అయితే గుర్రపు నాడాల్లో నలుపు అయితే మంచిది. ఎరుపు కూడా ఉపయోగించవచ్చు. ఇలా గుర్రపు నాడాలను వేలాడదీయడం వల్ల గాలి, ధూళి లోపలికి రావు. నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయి. దీంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇలా మార్వాడీలు కోట్ల రూపాయల బిజినెస్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడం వెనుక ఉన్న బలమైన కారణం ఇదే.
ఇక మార్వాడీలు చేసే పూజ ఇంకోటి ఉంది. వారు 21 గురువింద గింజలను ఎరుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి అమ్మవారి ఎదురుగా ఈశాన్యంలో పెట్టి పూజిస్తారు. ఈ పూజను శుక్రవారం పూట చేస్తారు. పూజలో భాగంగా కుంకుమార్చన, దీపారాధన, నైవేద్యం వంటివి చేస్తారు. ఇలా మార్వాడీలు రహస్య పూజలను నిర్వహిస్తారు. అందువల్ల మనకు ఎక్కడ చూసినా వారి బిజినెస్లు ఎంతో ఊపు మీద కనిపిస్తాయి. కనుక ఎవరైనా సరే ఇలా పూజలు చేస్తే ఆశించిన లాభాలను పొందవచ్చు. వ్యాపారంలో వృద్ధి చెందుతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…