Gold : అక్షయ తృతీయ రోజు కొంచమైనా పసిడి కొనుగోలు చేసే సంపద సిద్ధిస్తుందన్న నమ్మకంతో చాలా మంది ఆరోజు బంగారం కొనడం అనేది దేశంలో ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏవైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. దాంతో అప్పో సప్పో చేసి బంగారం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలా చేయడం వలన బంగారం అక్షయం అవ్వడం అటుంచి అప్పుచేసి బంగారం కొనడం వలన మరిన్ని సమస్యల్లోకి వెళ్లడం జరుగుతుంది. ఇది మేం చెబుతున్నది కాదు స్వయంగా చాగంటి గారే చెప్పారు.
అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మను ఆచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అంటే పాపం కొనుక్కోవడం అని ప్రవచించారు చాగంటి వారు. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఎవరు చెప్పారో కానీ పురాణాల్లో, శాస్త్రాల్లో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.
ఆ రోజున బంగారం కొనుక్కోవడం పిచ్చి పని. బంగారం కొనడం వలన పాపం వృద్ధి చెందడం తప్ప ఎటువంటి లాభాలు ఉండవని చెప్పారు. మరి అక్షయ తృతీయనాడు ఏం చేయాలి అనేదానికి సమాధానం ఇచ్చారు. స్వయం పాకం, బట్టలు, గొడుగు, ద్రవ్యం అనగా డబ్బు, చెప్పుల జత లాంటివి దానం ఇవ్వాలి తప్ప.. బంగారం కొనడం వలన పాపం అక్షయం అవుతుందని చెప్పారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…