Temples On Hills : ఈ అనంత సృష్టి అంతా భగవంతుని లీలే..! భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మనం జీవిస్తున్నాం. చనిపోతున్నాం. ఈ క్రమంలోనే భగవంతుడు అంతటా ఉంటాడని, ఆయన లేని ప్రదేశం లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్రతి రాయిలోనూ, చెక్కలోనూ, ప్రతి పదార్థంలోనూ దేవుడు నెలకొని ఉంటాడు. మరి.. అలాంటప్పుడు దేవుళ్ల ఆలయాలు కొన్ని ఎత్తయిన కొండలపై ఎందుకు ఉంటాయి..? సాధారణ నేలపై ఎందుకు ఉండవు..? అంటే.. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పర్వతాలు, నదులు, వృక్షాలను పరోపకార పరాయణులు అంటారట. అలా అని మహాకవి వాల్మీకి చెప్పాడు. అందుకే చాలా మంది రుషులు తపస్సు చేసి తాము కొండలుగా పుట్టాలని, తమపై వెలవాలని ఆయా దేవుళ్లను కోరుకున్నారట. దీని వల్లే భద్రగిరిపై రాముడు, యాదగిరిపై నరసింహుడు, సప్తగిరిపై వెంకటేశ్వర స్వామి.. ఇలా ఆయా గిరుల (కొండల)పై ఆయా దేవుళ్లు, దేవతలు వెలిశారు. అలా అని చెప్పి పర్వతాలపై ఉండే దేవుళ్లలోనే మహిమ ఉంటుంది, మిగతా వారిలో ఉండదని కాదు. దేవుడు ఎక్కడున్నా దేవుడే, ఆయన మనందరికీ ఆరాధ్య దైవమే.
కానీ.. ముందే చెప్పాం కదా.. మహాకవి వాల్మీకి చెప్పినట్టు పర్వతాలకు ఓ విశిష్ట స్థానం ఉంది కనుకే చాలా మంది దేవుళ్లు, దేవతలు రుషులకు వరాలిచ్చి అలా ఆయా కొండలపై వెలిశారు. ఈ క్రమంలో ఆయా దేవుళ్లు, దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పర్వతాలు ఆశ్రయం ఇస్తాయి. సేద తీరేలా చేస్తాయి. ఆహారం అందిస్తాయి కూడా. అలా పర్వతాలు ఎంతో మంది భక్తుల పాదస్పర్శతో తరిస్తాయి. అయితే ఇదే కాదు.. దేవుళ్లు కొండలపై ఎక్కువగా వెలియడానికి మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. మనకు దైవమంటే ఎంత ఇష్టమో, ఎంత భక్తో తెలుసుకునేందుకు, ఎంత కష్టానికి ఓర్చి దైవాన్ని దర్శించగలం అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టినట్టుగా కొండలపై వెలిశాడట. అందుకే అంత దూరంలో, అంత ఎత్తులో వెలసిన దేవున్ని చూసేందుకు వెళ్లినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెరవకూడదు. ఓర్పుగా ఉండాలి. అవన్నీ మనకు దైవం పెడుతున్న పరీక్షలే అనుకోవాలి.
అయితే దేవుళ్లు కొండలపై వెలియడానికి మరో కారణం ఏమిటంటే.. పూర్వం.. అంటే నాలుగో యుగంలో మొదటిదైన సత్య యుగం (కృత యుగం) ప్రారంభమైనప్పుడు దేవుళ్లు, దేవతలు కిందే ఉండేవారట. అయితే రాను రాను యుగాలు మారే కొద్దీ మానవుల్లో అవినీతి పెరగడం, అధర్మంగా ప్రవర్తించడం ఎక్కువై వారి మధ్య దేవుడు ఉండలేక దూరంలో కొండపై వెలిశాడట. అలా రాను రాను ఆ కొండలు పెరిగి పెరిగి కలియుగం వచ్చే వరకు ఇలా తయారయ్యాయట. అందుకే దేవుళ్లు, దేవతలు కొండలపై మనకు అంత దూరంలో దర్శనమిస్తారు.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…