ఆధ్యాత్మికం

Temples On Hills : దేవుళ్లు, దేవత‌లు ఎక్కువ‌గా కొండ‌ల‌పైనే ఎందుకు వెలిశారో తెలుసా..?

Temples On Hills : ఈ అనంత సృష్టి అంతా భ‌గ‌వంతుని లీలే..! భ‌గ‌వంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మ‌నం జీవిస్తున్నాం. చ‌నిపోతున్నాం. ఈ క్ర‌మంలోనే భ‌గ‌వంతుడు అంత‌టా ఉంటాడ‌ని, ఆయ‌న లేని ప్ర‌దేశం లేద‌ని పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్ర‌తి రాయిలోనూ, చెక్క‌లోనూ, ప్ర‌తి ప‌దార్థంలోనూ దేవుడు నెల‌కొని ఉంటాడు. మ‌రి.. అలాంట‌ప్పుడు దేవుళ్ల ఆల‌యాలు కొన్ని ఎత్త‌యిన కొండ‌ల‌పై ఎందుకు ఉంటాయి..? సాధార‌ణ నేల‌పై ఎందుకు ఉండ‌వు..? అంటే.. అందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ర్వ‌తాలు, న‌దులు, వృక్షాల‌ను పరోప‌కార ప‌రాయ‌ణులు అంటార‌ట‌. అలా అని మ‌హాక‌వి వాల్మీకి చెప్పాడు. అందుకే చాలా మంది రుషులు త‌ప‌స్సు చేసి తాము కొండ‌లుగా పుట్టాల‌ని, త‌మ‌పై వెలవాల‌ని ఆయా దేవుళ్ల‌ను కోరుకున్నార‌ట‌. దీని వ‌ల్లే భ‌ద్ర‌గిరిపై రాముడు, యాద‌గిరిపై నర‌సింహుడు, స‌ప్త‌గిరిపై వెంక‌టేశ్వ‌ర స్వామి.. ఇలా ఆయా గిరుల (కొండ‌ల‌)పై ఆయా దేవుళ్లు, దేవ‌త‌లు వెలిశారు. అలా అని చెప్పి ప‌ర్వ‌తాల‌పై ఉండే దేవుళ్లలోనే మ‌హిమ ఉంటుంది, మిగ‌తా వారిలో ఉండ‌ద‌ని కాదు. దేవుడు ఎక్క‌డున్నా దేవుడే, ఆయ‌న‌ మ‌నంద‌రికీ ఆరాధ్య దైవ‌మే.

Temples On Hills

కానీ.. ముందే చెప్పాం క‌దా.. మ‌హాకవి వాల్మీకి చెప్పిన‌ట్టు ప‌ర్వ‌తాల‌కు ఓ విశిష్ట స్థానం ఉంది క‌నుకే చాలా మంది దేవుళ్లు, దేవ‌త‌లు రుషులకు వ‌రాలిచ్చి అలా ఆయా కొండ‌ల‌పై వెలిశారు. ఈ క్ర‌మంలో ఆయా దేవుళ్లు, దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు ప‌ర్వ‌తాలు ఆశ్ర‌యం ఇస్తాయి. సేద తీరేలా చేస్తాయి. ఆహారం అందిస్తాయి కూడా. అలా ప‌ర్వతాలు ఎంతో మంది భ‌క్తుల పాద‌స్ప‌ర్శ‌తో త‌రిస్తాయి. అయితే ఇదే కాదు.. దేవుళ్లు కొండ‌ల‌పై ఎక్కువ‌గా వెలియ‌డానికి మ‌రో రెండు కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. మ‌నకు దైవమంటే ఎంత ఇష్ట‌మో, ఎంత భ‌క్తో తెలుసుకునేందుకు, ఎంత క‌ష్టానికి ఓర్చి దైవాన్ని ద‌ర్శించ‌గ‌లం అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు ఆ దేవుడు మ‌న‌కు ప‌రీక్ష పెట్టిన‌ట్టుగా కొండ‌ల‌పై వెలిశాడ‌ట‌. అందుకే అంత దూరంలో, అంత ఎత్తులో వెల‌సిన దేవున్ని చూసేందుకు వెళ్లిన‌ప్పుడు ఎన్ని క‌ష్టాలు ఎదురైనా వెర‌వ‌కూడ‌దు. ఓర్పుగా ఉండాలి. అవన్నీ మ‌న‌కు దైవం పెడుతున్న ప‌రీక్ష‌లే అనుకోవాలి.

అయితే దేవుళ్లు కొండ‌లపై వెలియ‌డానికి మ‌రో కార‌ణం ఏమిటంటే.. పూర్వం.. అంటే నాలుగో యుగంలో మొద‌టిదైన స‌త్య యుగం (కృత యుగం) ప్రారంభ‌మైన‌ప్పుడు దేవుళ్లు, దేవ‌త‌లు కిందే ఉండేవార‌ట‌. అయితే రాను రాను యుగాలు మారే కొద్దీ మాన‌వుల్లో అవినీతి పెర‌గడం, అధ‌ర్మంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఎక్కువై వారి మ‌ధ్య దేవుడు ఉండ‌లేక దూరంలో కొండ‌పై వెలిశాడ‌ట‌. అలా రాను రాను ఆ కొండలు పెరిగి పెరిగి క‌లియుగం వ‌చ్చే వ‌ర‌కు ఇలా త‌యార‌య్యాయ‌ట‌. అందుకే దేవుళ్లు, దేవ‌త‌లు కొండ‌ల‌పై మ‌న‌కు అంత దూరంలో ద‌ర్శ‌న‌మిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM