Temples On Hills : ఈ అనంత సృష్టి అంతా భగవంతుని లీలే..! భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మనం జీవిస్తున్నాం. చనిపోతున్నాం. ఈ క్రమంలోనే భగవంతుడు అంతటా ఉంటాడని, ఆయన లేని ప్రదేశం లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్రతి రాయిలోనూ, చెక్కలోనూ, ప్రతి పదార్థంలోనూ దేవుడు నెలకొని ఉంటాడు. మరి.. అలాంటప్పుడు దేవుళ్ల ఆలయాలు కొన్ని ఎత్తయిన కొండలపై ఎందుకు ఉంటాయి..? సాధారణ నేలపై ఎందుకు ఉండవు..? అంటే.. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పర్వతాలు, నదులు, వృక్షాలను పరోపకార పరాయణులు అంటారట. అలా అని మహాకవి వాల్మీకి చెప్పాడు. అందుకే చాలా మంది రుషులు తపస్సు చేసి తాము కొండలుగా పుట్టాలని, తమపై వెలవాలని ఆయా దేవుళ్లను కోరుకున్నారట. దీని వల్లే భద్రగిరిపై రాముడు, యాదగిరిపై నరసింహుడు, సప్తగిరిపై వెంకటేశ్వర స్వామి.. ఇలా ఆయా గిరుల (కొండల)పై ఆయా దేవుళ్లు, దేవతలు వెలిశారు. అలా అని చెప్పి పర్వతాలపై ఉండే దేవుళ్లలోనే మహిమ ఉంటుంది, మిగతా వారిలో ఉండదని కాదు. దేవుడు ఎక్కడున్నా దేవుడే, ఆయన మనందరికీ ఆరాధ్య దైవమే.
కానీ.. ముందే చెప్పాం కదా.. మహాకవి వాల్మీకి చెప్పినట్టు పర్వతాలకు ఓ విశిష్ట స్థానం ఉంది కనుకే చాలా మంది దేవుళ్లు, దేవతలు రుషులకు వరాలిచ్చి అలా ఆయా కొండలపై వెలిశారు. ఈ క్రమంలో ఆయా దేవుళ్లు, దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పర్వతాలు ఆశ్రయం ఇస్తాయి. సేద తీరేలా చేస్తాయి. ఆహారం అందిస్తాయి కూడా. అలా పర్వతాలు ఎంతో మంది భక్తుల పాదస్పర్శతో తరిస్తాయి. అయితే ఇదే కాదు.. దేవుళ్లు కొండలపై ఎక్కువగా వెలియడానికి మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. మనకు దైవమంటే ఎంత ఇష్టమో, ఎంత భక్తో తెలుసుకునేందుకు, ఎంత కష్టానికి ఓర్చి దైవాన్ని దర్శించగలం అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టినట్టుగా కొండలపై వెలిశాడట. అందుకే అంత దూరంలో, అంత ఎత్తులో వెలసిన దేవున్ని చూసేందుకు వెళ్లినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెరవకూడదు. ఓర్పుగా ఉండాలి. అవన్నీ మనకు దైవం పెడుతున్న పరీక్షలే అనుకోవాలి.
అయితే దేవుళ్లు కొండలపై వెలియడానికి మరో కారణం ఏమిటంటే.. పూర్వం.. అంటే నాలుగో యుగంలో మొదటిదైన సత్య యుగం (కృత యుగం) ప్రారంభమైనప్పుడు దేవుళ్లు, దేవతలు కిందే ఉండేవారట. అయితే రాను రాను యుగాలు మారే కొద్దీ మానవుల్లో అవినీతి పెరగడం, అధర్మంగా ప్రవర్తించడం ఎక్కువై వారి మధ్య దేవుడు ఉండలేక దూరంలో కొండపై వెలిశాడట. అలా రాను రాను ఆ కొండలు పెరిగి పెరిగి కలియుగం వచ్చే వరకు ఇలా తయారయ్యాయట. అందుకే దేవుళ్లు, దేవతలు కొండలపై మనకు అంత దూరంలో దర్శనమిస్తారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…