Lord Hanuman : రామాయణంలో.. రావణుడి చేత అపహరించబడిన సీత జాడ కనుగొనేందుకు రాముడు హనుమంతున్ని పంపుతాడు కదా. దీని గురించి చాలా మందికి తెలుసు. అయితే సీత అన్వేషణలో భాగంగా లంకకు వెళ్లిన హనుమంతుడు ఆమెను కనుగొన్నాక లంకలో చాలా అల్లరి చేస్తాడు. దీంతో లంకలో ఉండే రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు పెడతారు. అయితే హనుమ ఊరుకుంటాడా..? ఆ మంటతో మొత్తం లంకకు నిప్పు పెడతాడు. అందులో భాగంగా లంక చాలా వరకు దహనమవుతుంది. అయితే అప్పటికే హనుమంతుని తోక చాలా వరకు కాలి పోతుందట. మరి అలా కాలిన తోకకు ఏదో ఒక ఉపశమనం చేయాలి కదా. అదిగో ఆ భక్తులు చేస్తున్నదదే. ఇంతకీ వారేం చేస్తున్నారు..?
అది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సుచీంద్రం. ఈ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలసి ఒకే లింగం రూపంలో ఉద్భవించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందిగా భక్తులచే ఆదరణ పొందుతోంది. ఎంతో మంది ఈ క్షేత్రానికి వచ్చి స్వామివార్లను దర్శించుకుంటారు కూడా. ఈ క్షేత్రంలోనే హనుమంతుడికి చెందిన 18 అడుగుల ఎత్తైన విగ్రహం కూడా ఉంది. స్వామివారు కూడా ఇక్కడ భక్తులచే విశేష నీరాజనాలు అందుకుంటూ ఉంటాడు. అయితే ఈ హనుమ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే..
లంకా దహనంలో హనుమ తోక చాలా వరకు కాలిపోయిందని చెప్పాం కదా. అయితే కాలిన ఆ తోకకు ఉపశమనంగా అప్పట్లో ఆయన భక్తులు వెన్న రాశారాట. ఈ క్రమంలోనే సుచీంద్రం క్షేత్రంలో ఉన్న హనుమ విగ్రహ తోకకు కూడా భక్తులు చాలా మంది వెన్న రాస్తుంటారు. అలా రాస్తే ఆయనకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతే కాదు, అలా చేయడంవల్ల స్వామి ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ క్షేత్రానికి వెళ్లిన భక్తులు ఎవరైనా స్వామి వారి తోకకు వెన్న రాసి గానీ వెనక్కి రారు. చివరిగా ఇంకో విషయమేమిటంటే.. అలా స్వామి వారి తోకకు వెన్న రాసే సాంప్రదాయం ఈనాటిది కాదట. తరతరాల నుంచి వస్తున్నదేనట.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…