Naivedyam : ప్రతి రోజూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. అలానే అందరూ దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. అయితే దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే, ఎలాంటి ఫలితం కనిపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా పండ్లు, పూలు, కొబ్బరికాయ వంటివి దేవుడి కోసం తీసుకు వెళ్తూ ఉంటాం. భగవంతుడికి కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే మనం మొదలు పెట్టిన పనులు సులభంగా పూర్తి అవుతాయి. పై అధికారుల నుండి ఎలాంటి సమస్యలు కూడా రావు.
అదే అరటిపండుని పెడితే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండుని గుజ్జు కింద తీసి, దానిని నైవేద్యంగా పెడితే అప్పుల బాధ నుండి బయటపడొచ్చు. సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. మధ్యలో ఆగిపోయిన పనులు కూడా నెరవేరుతాయి. నేరేడు పండ్లను నైవేద్యం కింద పెడితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. భోజనంతో పాటుగా నేరేడు పండ్లని ఎవరికైనా వడ్డిస్తే అన్న పానీయాలకి లోటు ఉండదు.
దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్లను పెడితే సుఖసంతోషాలతో ఉండొచ్చు. నైవేద్యంగా ద్రాక్ష పండ్లు పెట్టి వాటిని చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పంచితే సుఖసంతోషాలు ఎప్పుడూ ఉంటాయి. ద్రాక్ష పండ్లను దానం చేస్తే పక్షవాత రోగాలు పోతాయి. మామిడి పండ్లను నైవేద్యంగా పెడితే గృహ నిర్మాణ సమస్యలు తొలగిపోతాయి. ఇష్టదైవానికి తేనె, మామిడి రసం నైవేద్యంగా పెట్టి దానిని అందరికీ పంచితే మోసం చేసిన వాళ్లలో మార్పు వస్తుంది. అంజీర పండ్లను నైవేద్యంగా పెడితే అనారోగ్య బాధలు పోతాయి. కీళ్ల నొప్పులు కూడా ఉండవు.
సపోటా పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే చికాకులు తొలగిపోతాయి. ఆపిల్ పండ్లని పెడితే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దరిద్ర బాధ ఉండదు. ధనవంతులు అవుతారు. కమలా పండ్లను పెట్టడం వలన పనులు సరైన టైమ్ కి పూర్తవుతాయి. పనస పండును నైవేద్యం కింద పెడితే శత్రు జయం కలుగుతుంది. రోగ నివారణతోపాటు కష్టాలన్నీ తొలగిపోతాయి. జామ పండ్లను పెడితే ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. చక్కెర వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…