Lord Surya Idols : హిందూ పురాణాల్లో సూర్య దేవునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది సూర్యున్ని రోజూ పూజిస్తారు, ప్రార్థిస్తారు కూడా. కొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. నిజానికి సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. ఆయన్ను పూజిస్తే జ్ఞానం, సంపద లభిస్తాయని నమ్ముతారు. ఆ కోవలోనే చాలా మంది సూర్యున్ని నిత్యం పూజిస్తారు. అయితే పలు రకాల లోహాలతో చేసిన సూర్యుని బొమ్మలను పూజించినా కూడా ముందు చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయట. మరి సూర్యునికి చెందిన ఏ తరహా బొమ్మలను పూజించాలో ఇప్పుడు తెలుసుకుందామా.
స్థోమత ఉన్న వారు బంగారంతో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో అమితమైన సంపద కలుగుతుంది. ఇంట్లో ఉన్న వారికి జ్ఞానం సిద్ధిస్తుంది. కొత్తగా పెళ్లయిన దంపతులు రాగితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించాలి. దీంతో వారి వైవాహిక జీవితం బాగుంటుంది. పిల్లలు త్వరగా కలుగుతారు. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. వెండితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే సమాజంలో అందరి మధ్య గౌరవం పెరుగుతుంది. పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. కెరీర్ బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
రాయి లేదా మట్టితో చేసిన సూర్యుని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే లక్ కలసి వస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి సమస్యలు ఎదురు కావు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. చెక్కతో చేసిన సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకుని ప్రార్థిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. అదృష్టవంతులుగా మారుతారు. అనుకున్నవి నెరవేరుతాయి. జీవితాంతం కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. గ్లాస్ లేదా ఇనుము తో చేసిన సూర్యుని బొమ్మలు, విగ్రహాలను మాత్రం ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. వీటి వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఏది చేసినా కలసి రాదు. అనుకున్న పనులు పూర్తి కావు. అన్నీ సమస్యలే ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండదు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…