Kidney Stones And Tomatoes : మనకు మార్కెట్లో చాలా సులభంగా లభ్యమయ్యే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని నిత్యం అనేక మంది కూరల్లో వాడుతుంటారు. కొందరు పలు ఆహార పదార్థాలను వండేందుకు ఉపయోగిస్తారు. ఇంకా కొందరు సలాడ్స్, సూప్, జ్యూస్ వంటివి చేసుకుని టమాటాలను తీసుకుంటుంటారు. అయితే టమాటాలను ఏ రకంగా తీసుకున్నా మనకు లాభమే ఉంటుంది కానీ, నష్టం మాత్రం ఉండదు. కానీ కొందరు మాత్రం టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయని అంటుంటారు. అయితే ఇందులో నిజమెంత..? నిజంగానే టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయా..? ఈ విషయంపై పరిశోధకులు ఏమంటున్నారు..? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
టమాటాలను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కానీ.. అది చాలా తక్కువ శాతం మాత్రమే. అసలు కిడ్నీ స్టోన్లు రాని వారు నిర్భయంగా టమాటాలను రోజూ తినవచ్చు. ఇక కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు, ఇతర కిడ్నీ సమస్యలు ఉన్నవారు.. మళ్లీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక టమాటాల వినియోగం తగ్గించాలి. దీంతో మళ్లీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. అంతేకానీ.. అసలు కిడ్నీ సమస్యలు లేనివారు, స్టోన్లు అసలు రాని వారు టమాటాలను తీసుకోవచ్చు. వాటిని తీసుకోవడం మానేయాల్సిన పనిలేదని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా కిడ్నీ స్టోన్లు మినరల్స్, ఆగ్జలేట్స్, కాల్షియం, యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఓవర్నైట్లో తయారు కావు. అవి ఏర్పడేందుకు చాలా కాలం పడుతుంది. అయితే కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు మళ్లీ అవి రాకుండా ఉండేందుకు గాను కచ్చితమైన డైట్ను పాటించాలి. అందులో భాగంగానే వారు టమాటాలు, పాలకూర వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. దీంతో మళ్లీ కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. ఇక అసలు స్టోన్స్ సమస్య లేనివారు ఏ పదార్థాలనైనా నిర్భయంగా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…