Lord Shiva Darshan : సాధారణంగా హిందువులు ఎవరైనా సరే ఏ దేవున్ని లేదా దేవతను అయినా సరే.. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివార్ల విగ్రహాలను చూస్తూ దర్శనం చేసుకుంటారు. కానీ ఒక్క శివాలయంలో మాత్రం దైవ దర్శనం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ దర్శనం చేసుకుంటారు. ఆ తరువాతే ఆలయంలోకి వెళ్లి లింగ దర్శనం చేసుకుంటారు. అయితే అసలు ఇలా శివాలయాల్లో ముందుగా నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు చూడాలి ? నేరుగా వెళ్లి శివున్ని దర్శించుకుంటే ఏమవుతుంది ? అలా ఎందుకు చేయరాదు ? అంటే..
శివుడు త్రిమూర్తులలో ఒకడు. కేవలం ఆయనకు మాత్రమే విగ్రహ రూపం ఉండదు. ఆయన్ను లింగ రూపంలో దర్శించుకోవాలి. శివుడు లయ కారకుడు. ఆయనకున్న మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. సకలం భస్మం అయిపోతుంది. అంతటి శక్తి ఆయన మూడో కన్నుకు ఉంటుంది. కనుక అలాంటి శక్తివంతున్ని నేరుగా దర్శించుకోరాదు. ముందుగా నంది కొమ్ముల నుంచి చూసి లింగ దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపలికి వెళ్లి లింగాన్ని చూడాలి. అంతే కానీ నేరుగా శివాలయం గర్భగుడిలోకి వెళ్లరాదు. వెళితే అరిష్టం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నంది వీపుపై నిమురుతూ మన కుడి చేతితో నంది చెవి మూయాలి. అనంతరం మన మనస్సులో ఉన్న కోరికతోపాటు మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం చెప్పాలి. అలా చెబుతూ శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవెరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తులకు కైలాస ప్రాప్తి కలుగుతుందట. మరుసటి జన్మ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…