Lord Ganesha : వినాయకుడిని ఆరాధిస్తే, ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. వినాయకుడిని ఆరాధిస్తే, విఘ్నాలు ఏమి లేకుండా, మన పనుల్ని మనం పూర్తి చేసుకోవచ్చు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, వినాయకుడికి కూడా విష్ణుమూర్తి లానే కొన్ని అవతారాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో భక్తులను రక్షించడానికి, విఘ్నేశ్వరుడు దాదాపు 8 అవతారాలు ఎత్తినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
మాత్యర్యాసురుడు, మదాసురుడు, మోహసురుడు వంటి రాక్షసులను జయించడానికి వక్రతుడు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికతుడు, విఘ్నరాజు అనే అవతారాలను వినాయకుడు ఎత్తాడు. ఆ అవతారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుడిని సృష్టించడం జరిగింది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించగా ఎన్నో శక్తులు వచ్చాయి. దేవతలంతా భయపడిపోయారు. సనత్ కుమారుని వద్దకు వెళ్లి ఉపాయం అడగగా సనత్ కుమారుని సూచన మేరకు వినాయకుడిని ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుడిని జయించాడు.
ఇంద్రుడు చేసిన తప్పు వలన మాత్సర్యాసురుడు పుడతాడు. అతని బాధలని భరించలేక దేవతలంతా దత్తాత్రేయుని శరణు కోరగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించమని చెప్తాడు. అప్పుడు వినాయకుడు వక్రతుండునిగా అవతరించాడు. అలానే, కుబేరుడి ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. చివరికి వినాయకుడిని ప్రార్ధించి లోభాసురుడి నుండి విముక్తి కల్పించమనగా గజాననుడిగా అవతరించి లోభాసురుడిని ఓడిస్తాడు వినాయకుడు.
అలానే, మోహాసురుడు అనే రాక్షసుడిని ఓడించడానికి వినాయకుడు మహోదరుడిగా పుట్టాడు. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మోహాసురుడు ముల్లోకాలను పీడించాడు. అప్పుడు దేవతలు వినాయకుడిని ప్రార్ధించారు. అప్పుడు, విఘ్నరాజు అవతారంలో నాగుపాముని వాహనం చేసుకుని సంహరించాడు. అలానే, అహంకరాసురుడిని సంహరించడానికి, వినాయకుడు దూమ్రావర్ణుడు అనే అవతారాన్ని ఎత్తాడు. ఇలా వినాయకుడు కూడా విష్ణు మూర్తి లానే అవతారాలు ఎత్తాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…