Lakshmi Devi Blessings : లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతోపాటు శుభాలు కూడా కలుగుతాయని అందరికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి, ఐశ్వర్యానికి అధిపతి. ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయని, ధనం మిక్కిలిగా సమకూరుతుందని చాలా మంది నమ్మకం. వ్యాపారస్తులైతే తమ దుకాణాల్లో, షాపులలో, ఇతర ప్రదేశాల్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని కచ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించవచ్చని వారి నమ్మకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుందట. అప్పుడు ఆ దేవి కటాక్షం ఇంకా ఎక్కువగా కలుగుతుందట. ఈ క్రమంలో లక్ష్మీదేవి కోసం ఏమేం పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ నెమలి ఫించాన్ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించే దగ్గర పెట్టుకోవాలి. దీంతో ఆ దేవి అనుగ్రహం లభిస్తుందట. ఎందుకంటే సరస్వతీ దేవి కూర్చునేది నెమలిపైనే కదా. అంతేకాదు, నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగెటివ్ శక్తి అంతా వెళ్లిపోయి, పాజిటివ్ శక్తి వస్తుందట. అది మనకు చాలా మేలు చేస్తుందట. బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గదిలో ఉంచాలి. ఆ నాణంపై లక్ష్మీ దేవి, వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిదట. దాంతో మిక్కిలిగా సంపద కలుగుతుందట.
తామర పూవులంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమట. ఆ దేవి తామరపూవు పైనే కూర్చుంటుంది కాబట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్నీ లాభాలే కలుగుతాయట. ధనం బాగా సమకూరుతుందట. లక్ష్మీదేవి తామరపూవు మీద కూర్చుని ఉండి సిరులు కురిపిస్తున్నట్టుగా ఉంటే చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో సిరులు కురుస్తాయట. ఇంట్లోని వారందరికీ అంతా మంచే జరుగుతుందట. మహిళలు నుదుట ధరించే కుంకుమ, చేతులకు ధరించే గాజులు, గోరింటాకు వంటి పలు రకాల అలంకరణ వస్తువులను ఇంట్లో ఉంచాలట. దీంతో ఆ ఇంట్లోని వారికి అంతా మంచే జరిగి సంపద సిద్దిస్తుందట.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…