Lord Shiva : ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చాలా మంది విష్ణువును ఏవిధంగా అయితే పూజిస్తారో శివున్ని కూడా అదేవిధంగా పూజిస్తారన్న సంగతి తెలిసిందే. శివ పూజకు చాలా మహత్యం ఉంటుంది. శివుడు అడిగిన వెంటనే వరాలు ఇచ్చే భోళాశంకరుడు. కనుకనే ఆయన్ను చాలా మంది భక్తులు పూజిస్తారు. చిన్న పుష్పం సమర్పించినా చాలు శివుడు పరవశించిపోతాడు. భక్తులు అడిగిన వరాలను ఇస్తాడు. ఇక మహా శివరాత్రి సందర్భంగా శివుడికి చాలా మంది పూజలు చేస్తుంటారు. ఆయనకు చాలా మంది అభిషేకం చేస్తుంటారు. అయితే చాలా మంది ఐశ్వర్యం, ఆనందం కావాలని కోరుకుంటారు. కానీ అందుకు శివున్ని ఎలా పూజించాలో వారికి తెలియదు. ఈ క్రమంలోనే ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐశ్వర్యం, ఆనందం కోసం శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే తెల్ల అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నదిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే శివుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తెల్ల అన్నంలో తేనె కలిపి పెట్టాలి. దీంతో అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. అదేవిధంగా తెల్ల అన్నంలో తేనె, చక్కెర, కొబ్బరి కలిపి ఆ అన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. దీని వల్ల సకల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలికంగా తగ్గకుండా ఉన్న మొండి రోగాలు సైతం నయమవుతాయి.
తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి శివుడికి నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని ఇతరులకు దానం చేయాలి. దీని వల్ల మీ ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఉండే కలహాలు తగ్గుతాయి. అందరూ ఆనందంగా, ప్రేమగా అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. భయాందోళనలు అన్నీ తొలగిపోతాయి. అలాగే తెల్ల అన్నంలో నల్లని నువ్వులు కలిపి శ్రీ శనీశ్వరునికి నైవేద్యం పెట్టి దాన్ని కాకులకు పెడితే మీకు ఉండే పితృదేవతల శాపాలు అన్నీ పోతాయి.
అన్నాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు గ్రాసంగా ఇవ్వాలి. అలాగే అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి, అప్పులు ఉంటే చెల్లిపోతాయి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తులు అవుతారు. అలాగే సరిగ్గా అన్నం తినని వారికి తెల్ల అన్నం, పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీయాలి. దీన్ని మూడు దారులు కలిసే చోట ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. దీంతో ఎటువంటి దిష్టి అయినా సరే పోతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…