Kameshwar Dham : హిందూ పురాణాల్లో మన్మథుడి గురించి తెలుసు కదా. అందమైన రూపం, చెరుకుగడ విల్లు, బాణాలు, సువాసనలు వెదజల్లే పూలతో అందరిలోనూ తాపాన్ని కలిగిస్తుంటాడు. కానీ మన్మథుడు ఒకానొక సమయంలో శివుని మూడో కన్నుకు భస్మమవుతాడు. అయితే మన్మథుడు అలా భస్మమైన ప్రాంతం మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా..? కామేశ్వర్ ధామ్లో..! అవును, మీరు విన్నది కరెక్టే..! ఇంతకీ శివుడు మన్మథున్ని ఎందుకు భస్మం చేశాడో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకానొక సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోనే కాకుండా దేవ లోకంలోనూ దేవతలందరినీ బాధిస్తుంటాడు. చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. దీంతో తారకాసురున్ని ఎలాగైనా వధించాలని అనుకుంటారు దేవతలు. కానీ ఆ పని శివుని కుమారుడికే సాధ్యమవుతుంది. అయితే అప్పటికి శివుడు ఇంకా బ్రహ్మచారే. పార్వతిని వివాహమాడలేదు. ఈ క్రమంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, అతని తపస్సుకు భంగం కలిగించి, అతనిలో విరహ తాపం కలిగించి పార్వతికి దగ్గరయ్యేలా చేసి ఆమె ద్వారా శివుడు పుత్రున్ని కనేలా చేయాలని దేవతలు భావిస్తారు. అయితే శివుని తపస్సుకు భంగం కలిగించేందుకు గాను దేవతలందరూ మన్మథున్ని పంపుతారు.
అప్పుడు మన్మథుడు తపస్సు చేసుకుంటున్న శివునిపై పూలబాణం వేస్తాడు. దీంతో శివుడు ఆగ్రహించి మన్మథున్ని మూడో కన్నుతో భస్మం చేస్తాడు. ఈ క్రమంలో అందరూ వేడుకోవడంతో, నిజం తెలుసుకున్న శివుడు మన్మథున్ని మళ్లీ బతికిస్తాడు. అయితే అలా శివుడు మన్మథున్ని భస్మం చేసిన ప్రాంతమే ఇప్పుడు కామేశ్వర్ ధామ్గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ శివుని మూడో కన్ను వల్ల ఓ మామిడి చెట్టు కాండం సగం వరకు కాలిపోతుంది. అయితే ఆ చెట్టు ఇప్పటికీ ఆ ధామ్లో అలాగే ఉంది. అది సగం కాలిపోయి మనకు కనిపిస్తుంది. కాగా ఈ ప్రదేశాన్ని రాముడు ఓసారి దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. కామేశ్వర్ ధామ్ ఉత్తర ప్రదేశ్లోని బల్లియా అనే ప్రాంతంలో ఉంది. కావాలంటే భక్తులు వెళ్లి ఆ చెట్టును, అక్కడి ఆలయాన్ని దర్శించి రావచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…