Deeparadhana : ప్రతి ఒక్కరూ కూడా, రోజు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఉదయం పూట ప్రతి ఒక్కరికి కూడా దీపం పెట్టాలని, పూజ చేయాలని తెలుసు. అయితే, సాయంత్రం పూట కూడా దీపాన్ని వెలిగించాలా అనే సందేహం, చాలా మందికి ఉంది. గృహిణికి ఉదయం పూట, స్నానం చేయాలి అని, మాత్రమే ధర్మం చెప్తోంది. సూర్యాస్తమయానికి, 48 నిమిషాల కంటే, ప్రారంభ సమయంలో అంటే, పూర్తిగా చీకటి పడదు. కొద్దిగా వెలుతురు ఉంటుంది. ఆ సమయంలో కాళ్లు, చేతులు కడుక్కోవాలి.
కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కుని, ముఖం కూడా కడుక్కుని, మళ్ళీ బొట్టు పెట్టుకుని ఉదయం నుండి వేసుకున్న దుస్తులను మార్చేసుకుని, దేవతగృహంలోకి వెళ్లి తైలంతో దీపారాధన చేయాలి. ఆ తర్వాత శ్లోకాలు ఏమైనా తెలిసి ఉంటే చదువుకోవాలి. ఇంట్లో వాళ్లంతా ఒక చోట కూర్చుని, పిల్లల్ని కూడా కూర్చోబెట్టి శ్లోకాలు, పద్యాలు, దండకములు చెప్పించాలి. ఇలా, సూర్యస్తమయం సమయాన్ని గడిపితే చాలా మంచి జరుగుతుంది.
జ్యోతి కాంతులని మనం ఆరాధన చేసేటప్పుడు, మనం చెప్పుకోవాల్సిన శ్లోకాలు, స్తోత్రాలు చాలా ఉన్నాయి. వాటిని చెప్పుకుని కూర్చుంటే, ఎంతో మంచి జరుగుతుంది. పత్తి వత్తులతో దీపారాధన చేస్తే పితృదేవతా దోషాలు తొలగిపోతాయి. అరటినార వత్తులతో దీపారాధన చేస్తే, కుటుంబ శాంతి, మంచి సంతానం, కుల దైవం అనుగ్రహం కలుగుతాయి. తామర వత్తులతో దీపారాధన చేస్తే, లక్ష్మి కటాక్షం కలుగుతుంది.
జిల్లెడు వత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. దుష్టశక్తుల పీడ నివారణ అవుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. పసుపు నీటితో తడిపిన కొత్త బట్ట వత్తులతో దీపారాధన చేస్తే, ఉదర సంబంధిత వ్యాధులు వుండవు. అమ్మకటాక్షం ఉంటుంది. కుంకుమ నీటితో తడిపిన కొత్త బట్ట వత్తులతో దీపారాధన చేస్తే, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు వంటివి తొలగిపోతాయి. పన్నీరు అద్దిన వత్తులలో నెయ్యి వేసి, దీపారాధన చేయడం వలన సిరిసంపదలు కలిగి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…