ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. యావత్ ప్రపంచానికి సూర్యుడు అధిపతి కనుక సూర్యుడిని పూజించడం వల్ల సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సూర్య భగవానునికి ఆదివారం అంటే ఎంతో ప్రీతికరం. ఈ క్రమంలోనే ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
రవి స్థానం బలపడాలంటే ఆదివారం ఉదయం నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి నిత్య పూజలతో పాటు, ఆదిత్య హృదయం, సూర్య అష్టోత్తరం వంటి శ్లోకాలను చదువుతూ ఆ సూర్యభగవానుడికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇక ఈ రోజు ఉపవాస దీక్షలతో స్వామివారిని పూజించాలనుకొనేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి నైవేద్యంగా గోధుమ రవ్వతో తయారు చేసిన ఏ పదార్థం అయినా పెట్టి ఆ తర్వాత ఉపవాస దీక్ష వదులుకోవాలి.
ఇక ఆదివారం సూర్యభగవానుడికి గన్నేరు పువ్వులు, జిల్లేడు పువ్వులు అంటే ఎంతో ప్రీతికరం కనుక వీటితో పూజ చేయడంవల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఆవుపాలతో చేసిన పరమాన్నంను సూర్యునికి నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలి. అయితే చాలామంది ఇంట్లో సూర్యుని ఫోటో ఉండకూడదని చెబుతుంటారు, కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. సూర్యుని ఫోటోలు ఇంట్లో ఉంచుకుని పూజ చేయవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద రథంలో వస్తున్నటువంటి ఫోటో ఉండటం ఎంతో మంచిది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…