సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రకాల పదార్థాలను, పండ్లను నైవేద్యంగా పెడుతుంటారు. ఎన్నో రకాల తీపి పదార్థాలను తయారు చేసి ముందుగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే మీరు ఎప్పుడైనా స్వామివారికి నైవేద్యంగా న్యూడిల్స్ పెట్టడం విన్నారా ? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కోల్కతాలోని చైనా టౌన్ (China Town)లో తంగ్రా అనే ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్న కాళీమాత ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడం మనం చూడవచ్చు.
అసలు ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడం ఏంటి అనే విషయానికి వస్తే.. కోల్కతాలోని చైనా టౌన్కి వెళితే మనం మన దేశం వదిలి చైనాలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు స్థిరపడి ఉన్నారు. ఇక్కడ వెలసినటువంటి అమ్మవారి ఆలయం విషయానికి వస్తే 60 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద రెండు విగ్రహాలు ఉండటంతో ప్రజలు ఆ విగ్రహాలకు పూజ చేసేవారు. అయితే రాను రాను ఈ ప్రాంతవాసులు విగ్రహాలకు ఆలయం నిర్మించి ఈ ఆలయంలో అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు చేసేవారు.
అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు ఉండటం వల్ల అమ్మ వారికి ముందుగా నైవేద్యంగా నూడుల్స్ సమర్పించిన తరువాతనే భక్తులకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అమ్మవారి ఆలయాన్ని దర్శించడం కోసం ఎంతో మంది భక్తులు వస్తున్నప్పటికీ అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ సమర్పించనిదే పూజలు చేయరు. ఇక్కడ అమ్మవారికి కేవలం నూడుల్స్ మాత్రమే కాకుండా చాప్ సుయ్, స్టిక్కీ రైస్ వంటివి కూడా ప్రసాదంగా భక్తులకు పెడతారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…