కలశం పై ఉన్న కొబ్బరికాయను ఏం చేయాలో తెలుసా?

April 29, 2021 2:24 PM

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు ముందుగా ఆ కార్యంలో కలశం ఏర్పాటు చేస్తాము. మన స్థాయికి తగ్గట్టుగా రాగి, వెండి చెంబుకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరిస్తారు. ఆ చెంబులోకి నిండు బిందె నీళ్ళను తీసుకొని అందులో కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ పువ్వులు వేసి ఆ చెంబు పై టెంకాయను ఉంచి చుట్టూ మావిడాకులు అలంకరిస్తారు.

ఈ విధంగా శుభకార్యాలలో కలశం ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది. అయితే పూజ అనంతరం కలశంపై ఉన్న టెంకాయను ఏం చేయాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే కలశంపై ఉన్న టెంకాయను మన ఇంట్లో పూజ చేయడానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఒకవేళ బ్రాహ్మణులు లేనిపక్షంలో ఆ టెంకాయను పారుతున్న నీటిలో వేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉండవు.

దేవాలయంలో కలశాన్ని పెడితే అది పూర్ణాహుతి చేస్తారు. అదే కలశం మన ఇంట్లో పెడితే దానిని బ్రాహ్మణులకు లేదా పారుతున్న నీటిలో నిమజ్జనం చేయాలని మన పెద్దవారు చెప్పేవారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now