ప్రతి ఏడాది చాలా మంది ఘనంగా జరుపుకునే పండగలలో సంక్రాంతి కూడా ఒకటి. దసరా లాగే సంక్రాంతిని కూడా తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. అయితే సంక్రాంతి సమయంలో వాస్తవానికి మన పెద్దలను పూజించుకుంటే ఎంతో మేలు జరుగుతుందట. సంక్రాంతి సమయంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనపై మన పితృదేవతల ఆశీస్సులు ఉంటాయట. కనుక సంక్రాంతి సమయంలో కొన్ని కార్యక్రమాలను చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక ఆ కార్యక్రమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి సమయంలో సూర్యుడు ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయనంలో పితృదేవతలు మన దగ్గరకి వస్తారట. ఉత్తరాయనం కాగానే వెళ్లిపోతారట. అంటే సంక్రాంతి సమయంలో అన్నమాట. అయితే అదే సమయంలో పితృదేవతలకు పూజలు, వాళ్ల పేరిట దానాలు చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందట. సంక్రాంతి సమయంలో వచ్చే కనుమ నాడు పూర్వీకులను పూజించాలి. వారి పేరిట దానాలను చేయాలి. తర్పణాలను కూడా వదలాలి. వీటిని ఎవరంటే వారు చేయవచ్చు. కానీ పిండాలను మాత్రం ఇంట్లో కుమారులు పెట్టాలి. పెద్ద కుమారుడు లేదా చిన్న కుమారుడు చేయాల్సి ఉంటుంది. ఇద్దరూ అందుబాటులో లేకపోతే వారి పేరు చెప్పి ఇతరులు ఎవరైనా పిండాలను పెట్టవచ్చు.
ఇక సంక్రాంతి సమయంలో దానాలు చేస్తే ఎంతో మంచిది. ముఖ్యంగా పేదలు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయి. సంక్రాంతి సమయంలో వెళ్లిపోయే పితృ దేవతలకు ఇలా చేయడం వల్ల వారు మనల్ని గుర్తుంచుకుంటారట. మనం ఏం చేసినా కలసి వచ్చేలా అనుగ్రహిస్తారట. కనుక సంక్రాంతి సమయంలో పితృదేవతలను పూజించడం మరిచిపోకండి.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…