Lord Shiva : కార్తీక మాసం వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరూ కూడా, ఆ నెల అంతా కూడా పరమశివుడుని, ఎంతో భక్తితో కొలుస్తారు. 12 మాసాల్లో, ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది. హిందువులు ఎంతో పవిత్రంగా కార్తీక మాసాన్ని భావించి, నిష్టతో పరమశివుడికి పూజలు చేస్తూ ఉంటారు. శివుడు అనుగ్రహం కలగాలని, శివుడుని ఇలా నిష్టతో పూజిస్తే, ఆయన కటాక్షం పొందవచ్చని హిందువుల నమ్మకం. అందుకనే, కార్తీక మాసంలో కచ్చితంగా అందరూ శివుడుని పూజిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో శివాలయాలు అసలు ఖాళీగా ఉండవు.
తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానాలు చేసి, పూజ మందిరంలో పూజలు చేసి, అలానే తులసి చెట్టుకి దీపారాధన చేసి, ఇలా ఎన్నో పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అలానే, దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయం లేదంటే శివాలయానికి వెళ్లి, అభిషేకాలను కూడా జరిపిస్తూ ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు. అందుకని పరమశివుడికి అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అభిషేకం చేయించుకుంటే, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగి పోతాయట. అదృష్టం కూడా కలుగుతుంది.
ఈ సంవత్సరం కార్తీకమాసం నవంబర్ 14 మంగళవారం నుండి మొదలవుతుంది. ఆ రోజు నుండి కూడా, మహిళలందరూ పరమ శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు. కేవలం శాఖాహారం మాత్రమే ఈ నెల అంతా తీసుకోవాలి. ఉల్లి, గుమ్మడికాయ, వెల్లుల్లి, ముల్లంగి వంటివి తీసుకోకూడదు.
పెసరపప్పు, శనగ పప్పు, నువ్వులు కూడా తీసుకోకూడదు. కొబ్బరి, ఉసిరి వంటి పదార్థాలని ఆదివారం నాడు, కార్తీకమాసంలో తీసుకోకూడదు. స్నానం చేసేటప్పుడు, నలుగు పెట్టుకోకూడదు. ఇలా, కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలని కచ్చితంగా పాటిస్తూ, పరమశివుడిని కనుక భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కచ్చితంగా మంచి జరుగుతుంది. అలానే, అనుకున్న కోరికలని కూడా, శివుడు తీరుస్తారు. బాధాలేమీ కూడా వుండవు. సంతోషంగా ఉండవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…