Lord Shiva : హిందువులందరూ శివుడిని పూజిస్తూ ఉంటారు. సర్వమంగళ స్వరూపుడు శివుడు. శివుడు ఆజ్ఞ లేకపోతే ఈ జగత్తులో ఏమీ కూడా జరగదు. శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. అందుకని ప్రత్యేకంగా సోమవారం నాడు, హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. శివుడిని కనుక పూజించారంటే ఎన్నో సమస్యల నుండి గట్టెక్కొచ్చు. శివుడిని సోమవారం నాడు పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం. అందులో తిరుగులేదు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
దారిద్ర బాధలు, ఇతర సమస్యలు కూడా పోతాయి. ఏ విధంగా పరమశివుడిని ఆరాధించాలి అనేది ఈ రోజు తెలుసుకుందాం.. సోమవారం ఉదయాన్నే లేచి, తలస్నానం చేయాలి. తర్వాత పార్వతీ పరమేశ్వరులు పటానికి గంధం రాసి, దాని మీద బొట్టు పెట్టాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. శివలింగానికి మంచి నీటితో అభిషేకాన్ని చేయాలి. తర్వాత విభూది సమర్పించి, ఆ విభూతిని నుదుటిని పెట్టుకోవాలి.
బిల్వపత్రం అంటే శివుడికి ఎంతో ఇష్టం. బిల్వాలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. బిల్వపత్రాన్ని శివుడికి సమర్పిస్తే దారిద్రం తొలగిపోతుంది. తెల్ల గన్నేరు, ఎర్ర గన్నేరు, తుమ్మి పూలు, మోదుగ పూలు, తెల్ల జిల్లేడు పూలు శివుడికి ఎంతో ఇష్టం. వీటితో పూజిస్తే ఎంతో మేలు కలుగుతుంది. శివ అష్టోత్తరాలు చదువుతూ సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. శివాలయానికి వెళ్లి కానీ లేదంటే ఇంట్లో కాని ఆవు నెయ్యి తో దీపం వెలిగించాలి.
సాయంత్రము నైవేద్యం కింద తాలింపు వేసిన పెరుగు అన్నం పెట్టాలి. ఇలా ప్రతి సోమవారం చేస్తే అప్పులు బాధలు పోతాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారు. శివ స్తోత్రాలు చదవడం శివ పంచాక్షరిని నిరంతరం జపించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. ఇలా శివుడి అనుగ్రహం పొంది కష్టాల నుండి గట్టెక్కచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…