Lord Shiva : హిందువులందరూ శివుడిని పూజిస్తూ ఉంటారు. సర్వమంగళ స్వరూపుడు శివుడు. శివుడు ఆజ్ఞ లేకపోతే ఈ జగత్తులో ఏమీ కూడా జరగదు. శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. అందుకని ప్రత్యేకంగా సోమవారం నాడు, హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. శివుడిని కనుక పూజించారంటే ఎన్నో సమస్యల నుండి గట్టెక్కొచ్చు. శివుడిని సోమవారం నాడు పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం. అందులో తిరుగులేదు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
దారిద్ర బాధలు, ఇతర సమస్యలు కూడా పోతాయి. ఏ విధంగా పరమశివుడిని ఆరాధించాలి అనేది ఈ రోజు తెలుసుకుందాం.. సోమవారం ఉదయాన్నే లేచి, తలస్నానం చేయాలి. తర్వాత పార్వతీ పరమేశ్వరులు పటానికి గంధం రాసి, దాని మీద బొట్టు పెట్టాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. శివలింగానికి మంచి నీటితో అభిషేకాన్ని చేయాలి. తర్వాత విభూది సమర్పించి, ఆ విభూతిని నుదుటిని పెట్టుకోవాలి.
బిల్వపత్రం అంటే శివుడికి ఎంతో ఇష్టం. బిల్వాలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. బిల్వపత్రాన్ని శివుడికి సమర్పిస్తే దారిద్రం తొలగిపోతుంది. తెల్ల గన్నేరు, ఎర్ర గన్నేరు, తుమ్మి పూలు, మోదుగ పూలు, తెల్ల జిల్లేడు పూలు శివుడికి ఎంతో ఇష్టం. వీటితో పూజిస్తే ఎంతో మేలు కలుగుతుంది. శివ అష్టోత్తరాలు చదువుతూ సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. శివాలయానికి వెళ్లి కానీ లేదంటే ఇంట్లో కాని ఆవు నెయ్యి తో దీపం వెలిగించాలి.
సాయంత్రము నైవేద్యం కింద తాలింపు వేసిన పెరుగు అన్నం పెట్టాలి. ఇలా ప్రతి సోమవారం చేస్తే అప్పులు బాధలు పోతాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారు. శివ స్తోత్రాలు చదవడం శివ పంచాక్షరిని నిరంతరం జపించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. ఇలా శివుడి అనుగ్రహం పొంది కష్టాల నుండి గట్టెక్కచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…