God Photos And Idols : ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఉంటుంది. చాలామందికి పూజకి సంబంధించిన విషయాలలో సందేహాలు ఉంటాయి. అటువంటి సందేహాలను తీర్చుకుంటే పాపం కలగకుండా సరిగ్గా పనిని పూర్తి చేయొచ్చు. చాలా మంది ఇళ్లల్లో పాత దేవుడు ఫోటోలు, పాడైపోయిన విగ్రహాలు వంటివి ఉంటాయి. వాటిని ఏం చేయాలో తెలీదు. ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. అటువంటప్పుడు వాటిని ఏం చేయాలి..? వాటిని పారేస్తే పాపం కదా.. మరి ఏం చేస్తే మంచిది అనే సందేహం చాలా మంది భక్తుల్లో ఉంది. మరి మీలో కూడా ఈ సందేహం ఉంటే వెంటనే తీర్చుకోండి.
కొంత మంది పాడైపోయిన విగ్రహాలని, దేవుడు ఫోటోలని దేవాలయంలో కానీ, రోడ్డుపక్క చెట్టు కింద కానీ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా చేయడం మహా పాపం. క్షమించరాని నేరమని చెప్పొచ్చు. ఇంట్లో ఉన్నంత వరకు రోజు పూజలు చేసి అందంగా దేవుడు పటాలని అలంకరిస్తారు. ఒకసారి పాడైపోయిన తర్వాత వాటిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు.
అవసరం లేని వాటిని, పాడైపోయినవి, విరిగిపోయినవి అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచిది. అగ్నిలో వేయడం మంచిది కాదు కదా… అలా కాల్చేస్తారా అని ఆలోచించకండి.. అగ్ని సర్వభక్షకుడు. అన్నివేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలని సమర్పించడంలో తప్పు లేదు.
లేదు అంటే ప్రవహిస్తున్న నదిలో వాటిని వెయ్యొచ్చు. నిమజ్జనం చేయడం కూడా మంచి పద్ధతి. ఆ విగ్రహానికి మీరు నమస్కరించి.. గచ్చగచ్చ సుర శ్రేష్ట స్వస్థాన పరమేశ్వరా.. అని చెప్పి వదిలేయండి. ఇది కూడా నిమజ్జనమే. కాబట్టి మీరు ఈ పద్ధతుల్ని పాటించొచ్చు. అంతేకానీ దేవాలయాల్లో కానీ, చెట్టు కింద కానీ వదిలేసి వచ్చేయొద్దు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…