పూజ చేసేటప్పుడు కలశంపై కొబ్బరికాయను తప్పనిసరిగా ఉంచాలి.. ఎందుకంటే..?

March 1, 2022 5:59 PM

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా పండుగల సమయంలో దేవాలయంలో లేదా మన ఇంటిలో కలశం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కలశంపై కొబ్బరికాయను పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా కలశంపై కేవలం కొబ్బరికాయను పెట్టడానికి గల కారణం ఏమిటో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇంట్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు కలశం పెట్టడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయని భావిస్తారు. అయితే కలశంపై కొబ్బరి కాయను పెట్టడానికి గల కారణం.. ఈ విశ్వం మొత్తానికి కొబ్బరికాయ మరో రూపంగా భావిస్తారు. సకల దేవతలు ఉన్న ఈ విశ్వానికి మరో ప్రతీక అయిన కొబ్బరికాయ ఆ దేవుళ్ళ అంశం కలిగి ఉంటుందని భావించడం వల్ల శుభకార్యాలు, పూజా సమయాలలో కలశంపై కొబ్బరికాయలను ప్రతిష్టిస్తారు.

ఈ విధంగా కలశంపై ప్రతిష్టించిన కొబ్బరికాయను పూజ అనంతరం బ్రాహ్మణుడికి ఇచ్చి పాదాభివందనం చేయడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయి. బ్రాహ్మణులు లేనిపక్షంలో ఆ కొబ్బరికాయను పారుతున్న కాలువలో వేయటం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment