ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు. మన పెద్దలు కూడా దైవ దర్శనం చేసుకుంటే మనస్సు ప్రశాంతంగా మారుతుందని.. అలాగే దైవం ఆశీస్సులు లభించి అనుకున్నవి నెరవేరుతాయని.. ఎలాంటి సమస్యలు కలగవని అంటుంటారు. అందుకనే చాలా మంది తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. అయితే ఆలయాలకు వెళ్లే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. వాటిల్లో మాంసాహారం తిని ఆలయానికి వెళ్లడం కూడా ఒకటి. ఈ ఆహారం తీసుకున్న తరువాత అసలు ఆలయానికి వెళ్లవచ్చా.. ప్రసాదం తినవచ్చా.. వంటి సందేహాలకు పండితులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారం తిన్న తరువాత ఆలయానికి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లరాదు. అలాగే ప్రసాదం లాంటివి కూడా తినరాదు. ఎందుకంటే.. అసలు మాంసాహారం అని కాదు.. శాకాహారం తీసుకుని కూడా ఆలయానికి వెళ్లరాదు. ఉపవాస దీక్షతో ఉండి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని రావాలి. ఆ తరువాత ఏ ఆహారం అయినా తినవచ్చు. అంతేకానీ.. ఆహారం తిన్నాక మాత్రం ఆలయానికి వెళ్లరాదు. ఎందుకంటే ఆహారం తిన్న తరువాత నిద్ర వస్తుంది. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అదే మాంసాహారం అయితే ఇంకా ఎక్కువగా నిద్రగా, మత్తుగా అనిపిస్తుంది. ఇలా నిద్ర మత్తులో ఉండి దైవాన్ని దర్శించుకోలేరు. దర్శించుకున్నా మనస్సు దైవంపై ఉండదు.
పైగా ఆహారం తిన్న తరువాత దాని లక్షణాలు మనకు వస్తాయి. అంటే మాంసాహారం తిన్నాక తామస గుణాలు వస్తాయి. కోపం, అసూయ, ద్వేషం అన్నీ కలుగుతాయి. అలాంటి స్థితిలో దైవంపై మనస్సు పెట్టలేరు. ఏమీ కోరుకోలేరు. ఒకవేళ కోరినా మనస్ఫూర్తిగా చేయరు. అలాంటప్పుడు దైవం వద్దకు వెళ్లి కూడా ఉపయోగం ఉండదు. కనుక మాంసాహారం అనే కాదు.. అసలు శాకాహారం కూడా తినకుండానే.. ఉపవాసంతోనే దైవాన్ని దర్శించుకోవాలి. దీంతో దైవంపైనే ధ్యాస అంతా ఉంటుంది. మనం అనుకున్నవి ప్రశాంతంగా దైవాన్ని కోరవచ్చు. దీంతో దైవ దర్శనం చేసుకున్నామన్న సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఇకపై ఆలయానికి వెళ్లాలంటే ఏమీ తినకుండానే వెళ్లండి. దీంతో మనస్ఫూర్తిగా కోరికలు కోరవచ్చు. దైవ దర్శనం కూడా సంపూర్తిగా అవుతుంది. కాబట్టి ఇకపై అలా చేయండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…