ఆధ్యాత్మికం

మాంసాహారం తిన్న త‌రువాత ఆల‌యానికి వెళ్ల‌వ‌చ్చా.. ప్ర‌సాదం తిన‌వ‌చ్చా..?

ప్ర‌తి ఒక్క‌రూ ఆధ్యాత్మిక చింత‌న‌ను క‌లిగి ఉండాల‌ని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు. మ‌న పెద్ద‌లు కూడా దైవ ద‌ర్శ‌నం చేసుకుంటే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ని.. అలాగే దైవం ఆశీస్సులు ల‌భించి అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని.. ఎలాంటి స‌మ‌స్య‌లు క‌ల‌గ‌వ‌ని అంటుంటారు. అందుక‌నే చాలా మంది త‌ర‌చూ ఆల‌యాల‌కు వెళ్తుంటారు. అయితే ఆల‌యాల‌కు వెళ్లే విష‌యంలో చాలా మందికి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. వాటిల్లో మాంసాహారం తిని ఆల‌యానికి వెళ్ల‌డం కూడా ఒక‌టి. ఈ ఆహారం తీసుకున్న త‌రువాత అస‌లు ఆల‌యానికి వెళ్ల‌వ‌చ్చా.. ప్ర‌సాదం తిన‌వ‌చ్చా.. వంటి సందేహాల‌కు పండితులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మాంసాహారం తిన్న త‌రువాత ఆల‌యానికి ఎట్టి ప‌రిస్థితిలోనూ వెళ్ల‌రాదు. అలాగే ప్ర‌సాదం లాంటివి కూడా తిన‌రాదు. ఎందుకంటే.. అస‌లు మాంసాహారం అని కాదు.. శాకాహారం తీసుకుని కూడా ఆల‌యానికి వెళ్ల‌రాదు. ఉప‌వాస దీక్ష‌తో ఉండి ఆల‌యానికి వెళ్లి దైవ ద‌ర్శ‌నం చేసుకుని రావాలి. ఆ త‌రువాత ఏ ఆహారం అయినా తిన‌వ‌చ్చు. అంతేకానీ.. ఆహారం తిన్నాక మాత్రం ఆల‌యానికి వెళ్ల‌రాదు. ఎందుకంటే ఆహారం తిన్న త‌రువాత నిద్ర వస్తుంది. శ‌రీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అదే మాంసాహారం అయితే ఇంకా ఎక్కువ‌గా నిద్ర‌గా, మ‌త్తుగా అనిపిస్తుంది. ఇలా నిద్ర మ‌త్తులో ఉండి దైవాన్ని ద‌ర్శించుకోలేరు. ద‌ర్శించుకున్నా మ‌న‌స్సు దైవంపై ఉండ‌దు.

పైగా ఆహారం తిన్న త‌రువాత దాని ల‌క్ష‌ణాలు మ‌న‌కు వ‌స్తాయి. అంటే మాంసాహారం తిన్నాక తామ‌స గుణాలు వ‌స్తాయి. కోపం, అసూయ‌, ద్వేషం అన్నీ క‌లుగుతాయి. అలాంటి స్థితిలో దైవంపై మ‌న‌స్సు పెట్ట‌లేరు. ఏమీ కోరుకోలేరు. ఒక‌వేళ కోరినా మ‌న‌స్ఫూర్తిగా చేయ‌రు. అలాంట‌ప్పుడు దైవం వ‌ద్ద‌కు వెళ్లి కూడా ఉప‌యోగం ఉండ‌దు. క‌నుక మాంసాహారం అనే కాదు.. అస‌లు శాకాహారం కూడా తిన‌కుండానే.. ఉప‌వాసంతోనే దైవాన్ని ద‌ర్శించుకోవాలి. దీంతో దైవంపైనే ధ్యాస అంతా ఉంటుంది. మ‌నం అనుకున్న‌వి ప్ర‌శాంతంగా దైవాన్ని కోర‌వ‌చ్చు. దీంతో దైవ ద‌ర్శ‌నం చేసుకున్నామ‌న్న సంతృప్తి క‌లుగుతుంది. కాబ‌ట్టి ఇక‌పై ఆల‌యానికి వెళ్లాలంటే ఏమీ తిన‌కుండానే వెళ్లండి. దీంతో మ‌న‌స్ఫూర్తిగా కోరిక‌లు కోర‌వ‌చ్చు. దైవ ద‌ర్శ‌నం కూడా సంపూర్తిగా అవుతుంది. కాబ‌ట్టి ఇక‌పై అలా చేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాజా సాబ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. చిత్ర యూనిట్‌కు ప్రభాస్ గిఫ్టులు! ‘డార్లింగ్’ అంటే అంతే మరి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…

Saturday, 24 January 2026, 9:49 PM

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM