ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు. మన పెద్దలు కూడా దైవ దర్శనం చేసుకుంటే మనస్సు ప్రశాంతంగా మారుతుందని.. అలాగే దైవం ఆశీస్సులు లభించి అనుకున్నవి నెరవేరుతాయని.. ఎలాంటి సమస్యలు కలగవని అంటుంటారు. అందుకనే చాలా మంది తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. అయితే ఆలయాలకు వెళ్లే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తుంటాయి. వాటిల్లో మాంసాహారం తిని ఆలయానికి వెళ్లడం కూడా ఒకటి. ఈ ఆహారం తీసుకున్న తరువాత అసలు ఆలయానికి వెళ్లవచ్చా.. ప్రసాదం తినవచ్చా.. వంటి సందేహాలకు పండితులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారం తిన్న తరువాత ఆలయానికి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లరాదు. అలాగే ప్రసాదం లాంటివి కూడా తినరాదు. ఎందుకంటే.. అసలు మాంసాహారం అని కాదు.. శాకాహారం తీసుకుని కూడా ఆలయానికి వెళ్లరాదు. ఉపవాస దీక్షతో ఉండి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని రావాలి. ఆ తరువాత ఏ ఆహారం అయినా తినవచ్చు. అంతేకానీ.. ఆహారం తిన్నాక మాత్రం ఆలయానికి వెళ్లరాదు. ఎందుకంటే ఆహారం తిన్న తరువాత నిద్ర వస్తుంది. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అదే మాంసాహారం అయితే ఇంకా ఎక్కువగా నిద్రగా, మత్తుగా అనిపిస్తుంది. ఇలా నిద్ర మత్తులో ఉండి దైవాన్ని దర్శించుకోలేరు. దర్శించుకున్నా మనస్సు దైవంపై ఉండదు.
పైగా ఆహారం తిన్న తరువాత దాని లక్షణాలు మనకు వస్తాయి. అంటే మాంసాహారం తిన్నాక తామస గుణాలు వస్తాయి. కోపం, అసూయ, ద్వేషం అన్నీ కలుగుతాయి. అలాంటి స్థితిలో దైవంపై మనస్సు పెట్టలేరు. ఏమీ కోరుకోలేరు. ఒకవేళ కోరినా మనస్ఫూర్తిగా చేయరు. అలాంటప్పుడు దైవం వద్దకు వెళ్లి కూడా ఉపయోగం ఉండదు. కనుక మాంసాహారం అనే కాదు.. అసలు శాకాహారం కూడా తినకుండానే.. ఉపవాసంతోనే దైవాన్ని దర్శించుకోవాలి. దీంతో దైవంపైనే ధ్యాస అంతా ఉంటుంది. మనం అనుకున్నవి ప్రశాంతంగా దైవాన్ని కోరవచ్చు. దీంతో దైవ దర్శనం చేసుకున్నామన్న సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఇకపై ఆలయానికి వెళ్లాలంటే ఏమీ తినకుండానే వెళ్లండి. దీంతో మనస్ఫూర్తిగా కోరికలు కోరవచ్చు. దైవ దర్శనం కూడా సంపూర్తిగా అవుతుంది. కాబట్టి ఇకపై అలా చేయండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…