Bachali Kura : బచ్చలి ఆకు ఎక్కువగా పల్లెటూర్లలో కనిపిస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ ఎ, బి, సి, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వారంలో రెండు సార్లు ఈ ఆకుకూరను తీసుకుంటే మంచిది. బచ్చలి ఆకులో ఉన్న పోషకాలు కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
అలాగే ఈ ఆకుల్లో ఉండే రెటినోల్ కంటి కండరాల బలహీనతను తగ్గించి కంటి చూపు పెరగటానికి, వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలను తగ్గించడానికి పనిచేస్తుంది. బచ్చలికూరను ఆహారంగా తీసుకోవటం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుంది. రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించటంలో సైతం ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మెదడు డ్యామేజి కాకుండా కాపాడతాయి. క్యాల్షియం సమృద్ధిగా ఉండటం వలన కీళ్లనొప్పులు లేకుండా చేస్తుంది.
ఇందులోని పీచు జీర్ణశక్తిని పెంచి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడే వారు బచ్చలి కూర తినటం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేయటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు వారానికి మూడుసార్లు ఈ కూరను తీసుకోవటం ఆరోగ్యపరంగా మంచిది.
బచ్చలి కూరలో విటమిన్-ఎ, లుటిన్, కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన మెదడు నిర్మాణాత్మక, క్రియాత్మక నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బచ్చలి కూరను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రసం లేదా స్మూతీ రూపంలో బచ్చలికూరను ఆహారంలో తీసుకోవడం వల్ల అధిక మోతాదులో పోషకాలు లభిస్తాయి. ఈ ఆకు కూరను తినడం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…