ఆధ్యాత్మికం

ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే ఇంటిని విడిచిపెట్టాలా.. ఇంట్లో ప్రేతాత్మ‌లు తిరుగుతాయా..?

ఇంట్లో వ్య‌క్తి ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే ఇళ్లు వ‌దిలి పెట్టాల‌ని, శాంతిపూజ‌లు చేయాల‌ని పండితులు చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది వీటిని న‌మ్మాలా వ‌ద్దా అని సంశ‌యిస్తూ ఉంటారు. కొద్ద‌రు పండితులు చెపినట్టు ఇళ్లు వ‌దిలి పెడ‌తారు. కొంద‌రు ఏం కాదులే అని అదే ఇంట్లో ఉంటూ ఉంటారు. అస‌లు ఇంట్లో వ్య‌క్తి మ‌ర‌ణిస్తే పూజ‌లు చేయాలా వ‌ద్దా, ఇళ్లు వ‌ద‌లాలా వ‌ద్దా శాస్త్రం ఏం చెబుతుంది.. దీని గురించి పండితులు ఏమంటున్నారు అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వ్య‌క్తి మ‌రణించిన స‌మ‌యాన్ని బ‌ట్టి ఇళ్లు వ‌దిలి పెట్టాల వ‌ద్దా అనేది ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. వ్య‌క్తి మ‌ర‌ణించిన స‌మ‌యంలో న‌క్ష‌త్రాల‌ను బ‌ట్టి ఇంటిని 3 నుండి 6 నెల‌ల వ‌ర‌కు వ‌దిలి పెట్టాల‌ని పండితులు చెబుతున్నారు.

అలాగే మంగ‌ళ‌వారం క‌నుక మ‌ర‌ణిస్తే ఖ‌చ్చితంగా శాంతి పూజ‌లు చేయాల‌ని వారు చెబుతున్నారు. మంగ‌ళ వారం తిరుగును కోరుతుంది. ఒక‌వేళ శాంతి పూజ‌లు క‌నుక చేయ‌క‌పోతే ఆ ఇంట్లో మ‌రో వ్య‌క్తి మ‌ర‌ణించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. అలాగే చాలా మంది వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌రువాత సంవ‌త్స‌రం వ‌ర‌కు ఇంట్లో దీపారాధాన కానీ, దాన ధ‌ర్మాలు కానీ. అలాగే దైవ‌ద‌ర్శ‌నం కానీ చేయ‌రు. కానీ వ్య‌క్తి మ‌ర‌ణించిన తరువాత పెద్ద క‌ర్మ జ‌రిగిన త‌రువాత ఇంట్లో పూజ‌లు త‌ప్ప‌కుండా చేయాల‌ని పండితులు చెబుతున్నారు. ఒకవేళ పూజ‌లు, దైవ సంబంధిత కార్య క్ర‌మాలు క‌నుక చేయ‌క‌పోతే ఇంట్లో భూతాలు, పిశాచాలు, ప్రేతాలు ఇంట్లోకి వ‌చ్చి ఆవ‌హిస్తాయ‌ని పండితులు చెబుతున్నారు.

దీంతో ఇంట్లో వ్య‌క్తుల మ‌ధ్య గొడవ‌లు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఒక‌రి మీద ఒక‌రికి గౌర‌వ మ‌ర్యాద‌లు త‌గ్గిపోతాయి. ఇంట్లో ఉన్న వ్య‌క్తులు వారి ఇష్టం వ‌చ్చినట్టు న‌డుచుకుంటారు. ఇంట్లో స‌మ‌స్య‌ల త‌లెత్త‌డం, అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం వంటివి జ‌రుగుతాయని పండితులు తెలియ‌జేస్తున్నారు. వ్య‌క్తి చ‌నిపోయిన‌ప్ప‌టికి పెద్ద క‌ర్మ జ‌రిగిన మ‌రుస‌టి రోజు నుండి ఇంట్లో దీపం వెలిగించ‌వ‌చ్చ‌ని ఇంట్లోని ఎవ‌రైనా వెలిగించవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM