నిద్ర లేవగానే ఇలా చేస్తే సంపద మీ వెంటే..!

September 11, 2021 1:00 PM

సాధారణంగా చాలా మంది ప్రతి రోజూ ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారిలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఎదుగుదల ఉండదు. కష్టపడి డబ్బులు సంపాదించిన డబ్బులు అనవసరంగా ఖర్చుకావడం లేదా అనారోగ్య సమస్యల కారణంగా అధిక డబ్బులు వృథా కావడం వంటివి జరుగుతుంటాయి. ఈ విధంగా అనవసరంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద కలగాలంటే ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఈ పద్ధతులను పాటించాలి. దీంతో సంపద కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

నిద్ర లేవగానే ఇలా చేస్తే సంపద మీ వెంటే..!

ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులను ధరించి పవిత్రమైన మనసుతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి క్రమంగా సంపద వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ప్రతి ఆదివారం ఉదయం సూర్యుడి కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించాలి. అయితే ఆదివారం సూర్యభగవానుడిని పూజించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.

ఆదివారం సూర్యభగవానుడిని పూజించే వారు తప్పనిసరిగా శాకాహారం మాత్రమే తినాలి. మాంసాహారం జోలికి పోకూడదు. సూర్యుడిని పూజిస్తే మంత్రాలు చదువుతూ ఉండాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే స్వచ్ఛమైన మనసుతో ఆ దేవుడికి పూజ చేయటం వల్ల క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనం కష్టపడి సంపాదిస్తున్న డబ్బు వృథా కాకుండా క్రమ క్రమంగా డబ్బు ఆదా అవుతుందని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment