ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆ మాటలను పట్టించుకోవడం లేదు. దీంతో వారు మోసగాళ్ల బారిన పడుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బు నష్టపోతున్నారు. బెంగళూరులో ఓ మహిళ కూడా సరిగ్గా ఇలాగే పెద్ద ఎత్తున డబ్బును పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే…
బెంగళూరులోని వైట్ ఫీల్డ్లో నివాసం ఉండే ఆంచల్ ఖండేల్వాల్ అనే మహిళ మార్చి 24వ తేదీన గూగుల్ లో సెర్చ్ చేసి ఆన్లైన్లో వైన్ డెలివరీ ఇచ్చే వారి ఫోన్ నంబర్లను సేకరించింది. రణవీర్ సింగ్గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తితో ఆమె ఫోన్లో మాట్లాడింది. తనకు ముందుగా కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇవ్వాలని వెంటనే వైన్ను ఇంటికి డోర్ డెలివరీ చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె నమ్మి అతనికి ఆన్లైన్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేసింది.
అయితే ఎన్నిసార్లు డబ్బు పంపినా అతను రాలేదని చెప్పాడు. దీంతో ఆమె అలా నగదును ట్రాన్స్ఫర్ చేస్తూనే వెళ్లింది. ఈ క్రమంలో ఆమె అతనికి మొత్తం రూ.1,59,595 పంపించింది. అయితే చివరకు తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు వారం తరువాత ఫిర్యాదు చేసింది. అన్ని రోజులూ ఎందుకు వేచి ఉన్నావని అడిగితే డబ్బులు వెనక్కి ఇస్తారని ఆగానని చెప్పింది. కానీ అప్పుడే చెప్పి ఉంటే వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసేవారమని, దీంతో డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉండేదని, ఇప్పుడు కష్టమని పోలీసులు ఆమెకు చెప్పారు. అయినప్పటికీ వారు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…