ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, విద్యాబాలన్ తమ సందేశాలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో స్లిమ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, ఎంతో బొద్దుగా ఉండే విద్యాబాలన్ “మనకు మనమే ముఖ్యం అంటూ తనదైన శైలిలో అభిమానులకు సందేశం ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఓ చెట్టు పై ఎక్కి ఫోటో దిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఈ విధంగా తెలియజేశారు.
ఆరోగ్యం అనేది బయట నుంచి మాత్రమే కాకుండా మన శరీరం లోపల ఉండటం కూడా ఎంతో ముఖ్యం అంటూ ఆమె తెలిపారు. ఎంతోమంది చాలా స్లిమ్ గా కనిపించడం కోసం జిమ్ కి వెళ్లి ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. కానీ అంతర్గత ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని, మనసు ఆనందంగా ఉన్నప్పుడే అసలైన ఆరోగ్యం అంటూ తెలిపారు.
ఇక విద్యాబాలన్ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరోసారి బరువు ప్రస్తావన తీసుకువచ్చారు.”ఆరోగ్యంలో బరువు ఒక అంశం అయితే పరవాలేదు కానీ, అదే మీ గుర్తింపు కాకూడదు అంటూ”అభిమానులకు సందేశం ఇచ్చారు. అధిక బరువు ఉన్నవారు కృంగి పోవాల్సిన పనిలేదు అన్నట్టుగా విద్యాబాలన్ అభిమానులకు తెలియజేశారు.ఈ విధంగా ఆరోగ్యం గురించి ఇద్దరు తారలు చేసిన సందేశం ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించేవిగా ఉన్నాయి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…