ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని.. ఆమె కుటుంబాన్ని బెదిరించి తమ పెళ్లికి వారిని ఒప్పించాలని.. తాను సూసైడ్ చేసుకున్నట్లు ఓ కట్టుకథ అల్లాడు. అయితే అతను చేసిన పనికి తీవ్ర మనస్థాపం చెందిన ప్రియురాలు నిజంగానే ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకకు చెందిన సక్కమ, అరుణ్లు ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ సక్కమ కుటుంబ సభ్యులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అరుణ్ ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పి తన ఫ్రెండ్ గోపాల్తో కలిసి ఓ కట్టుకథ అల్లాడు. తాను సూసైడ్ చేసుకునేందుకు యత్నించానని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానని ఓ కథ సృష్టించాడు.
ఈ క్రమంలోనే అరుణ్ పథకం ప్రకారం గోపాల్ తాను పోలీస్ అని చెప్పి సక్కమ కుటుంబ సభ్యులను కలిశాడు. వెంటనే అరుణ్, సక్కమ ల పెళ్లి ఫిక్స్ చేయాలని.. లేదంటే అరుణ్ ఆత్మహత్య యత్నానికి మీరే కారణమని కేస్ పెడతానని.. గోపాల్ హెచ్చరించాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న సక్కమ తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయట పడింది. అరుణ్ ఆత్మహత్యా యత్నం చేయలేదని, తన ఫ్రెండ్ గోపాల్తో కలిసి కట్టుకథ అల్లాడని తెలుసుకున్నారు. ఇక పోలీస్ అని చెప్పి సక్కమ కుటుంబ సభ్యులను బెదిరించినందుకు గాను గోపాల్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…