పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకుండానే భార్యపై భర్త అనుమానాలు పెంచుకున్నాడు. తన మాదిరిగానే తన భార్యకు మరొకరితో అక్రమసంబంధం ఉందని అనుమానించిన ఆ భర్త ఎలాగైనా తన భార్య అడ్డును తొలగించి తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం సెల్ఫి పేరుతో ఆమెను ఓ కొండపై నుంచి తోసి చంపిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకుంది. పొట్టి వివరాలలోకి వెళితే..
జిల్లాలోని చిన్నోని పల్లే గ్రామానికి చెందిన జయ రాములకు జిల్లెల గ్రామానికి చెందిన మద్దిలేటి శరణ్యకు గత రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే అప్పటికే జయరాములకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉండటం వల్ల ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలని చూశాడు. ఈ క్రమంలోనే ఆమె ఫోన్లో మాట్లాడిన ఆమెపై అనుమానం పడేవాడు. పథకం ప్రకారం తన భార్యను అడ్డు తప్పించి తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించిన జయరాములు తమ తల్లిదండ్రులతో ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలని చెప్పి తన భార్య శరణ్యను తీసుకు వెళ్ళాడు .
ఈ క్రమంలోనే గుడి పేరుతో సమీపంలో ఉన్న తిరుమలయ్య కొండకు తీసుకువెళ్లి అక్కడ సెల్ఫీ దిగడం కోసం కొండ అంచకు వెళ్లారు. ఈ క్రమంలోనే ముందుగా అనుకున్న ప్రకారం తనని కొండ పైనుంచి కిందకు తోసి నేరం తనపైకి రాకుండా తన అత్తమామలకు తమ కూతురు కనిపించలేదని ఫోన్ చేశాడు. అయితే తన మాటలు నమ్మని శరణ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు జయ రాములను కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పెట్టాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…