కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వందలకొద్దీ లారీలు వరదలో చిక్కుకుపోయాయి. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అయితే అప్పటికే ఇసుక కోసం వందలాది లారీలు అక్కడ ఉండడంతో లారీలు మొత్తం వరద ఉధృతిలో చిక్కుకుపోయాయి.
ఈ వరద ఉధృతికి సుమారు 132 లారీలు కొట్టుకుపోవడంతో లారీ డ్రైవర్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నఫలంగా వరద ఉధృతి పెరగడంతో లారీలు వెనుదిరిగ లేక వరద ప్రవాహంలో చిక్కుకుపోయాయి. ఈ విధంగా లారీలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు,రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈక్రమంలోనే వరదల్లో చిక్కుకున్న ప్రొక్లెయిన్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కూలీలను, క్లీనర్ లను అగ్నిమాపక సిబ్బంది పడవల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అలాగే వరదలో కొట్టుకుపోయిన లారీల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గితే తప్ప వరదల్లో చిక్కుకున్నటువంటి లారీలను బయటకు తీసుకు తీయలేమని అధికారులు తెలియజేయడంతో లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…