కొన్నిసార్లు ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. అందరితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకులు ఒక్కసారిగా మడుగులో గల్లంతయ్యే పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగులో నలుగురు గల్లంతయ్యారు. ఆ నలుగురు బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
విహార యాత్రల కోసం బెంగళూరు నుంచి 10 మంది చిత్తూరులోనే వాల్మీకిపురం అని గ్రామంలోని తన బంధువుల ఇంటికి చేరుకున్నారు. అక్కడ మరో పది మందితో కలిసి వీరందరూ సరదాగా వెలిగల్లు ప్రాజెక్టుకి వెళ్లారు. ప్రాజెక్టు వద్ద అందరూ కలిసి ఎంతో సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే అందరూ ఆడుకుంటూ దిగువన ఉన్న గండి మడుగులోకి సరదాగా ఈతకు వెళ్లారు.
అందరూ కలిసి ఎంతో సరదాగా ఈత కొడుతున్న సమయంలో వారిలో నలుగురు సభ్యులు మడుగులో గల్లంతైపోయారు. గల్లంతయిన వారు మహ్మద్ హఫీజ్(10), ఉస్మాన్ ఖానమ్(12), తాజ్ మహమద్(40), మహ్మద్ హంజా(12) గా గుర్తించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్ సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…