సాధారణంగా ఏ తల్లి అయినా తనకు ఎంతటి కష్టం వచ్చినా తన బిడ్డల ఆలనాపాలనా చూస్తూ ఆ కష్టాన్ని మరిచిపోయి బిడ్డలకోసం బతుకుతుంది. కడుపు తీపిని చంపుకోలేక తన బిడ్డలకు ఏమాత్రం కష్టం రాకుండా తల్లి అన్ని బాధలను తన కడుపులో దాచుకొని తన బిడ్డలను పెంచుతుంది. కానీ ఈ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ.. ఏకంగా తన ముగ్గురు బిడ్డల ప్రాణాలు తీసి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వేలూరులోని తోటపాళ్యంలో దినేష్, జీవిత అనే దంపతులు నివసిస్తున్నారు. దినేష్ టైల్స్ అతికించే పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. వీరికి అక్షయ్, నందన్ కుమార్, మరో ఆరు నెలల చిన్నారి ఉన్నారు. ఇలా టైల్స్ అతికిస్తూ దినేష్ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ రోజూ మద్యం సేవించి జీవితతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్ళిన జీవిత గురువారం తన భర్త దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది.
ఈ క్రమంలోనే దినేష్ ఉదయం 7 గంటలకే పనికి వెళ్లడంతో తన తల్లి జీవితకి ఫోన్ చేసింది. ఇలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆ తల్లి తన కుమారుడు జగదీష్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఇంటికి వెళ్లి చూడమని చెప్పింది. జగదీష్ ఇంటికి వెళ్లగా తలుపు లోపల గడియ పెట్టడంతో డోర్ తీయడానికి ప్రయత్నించాడు. అయితే జగదీష్ చివరికి డోర్ తీసి చూడగా తన అక్క, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన అక్క, పిల్లలు చనిపోవడానికి కారణం ఆమె భర్త అని, ఈతను రోజూ తాగొచ్చి ఆమెను చిత్రహింసలకు గురి చేయడం వల్లే మానసికంగా కృంగిపోయి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…