ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువతీ యువకులు పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ కేవలం క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా వికారాబాద్ కి చెందిన ఓ వివాహిత కేవలం తన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో చెప్పిన మాట ప్రకారం బంగారం ఇవ్వలేదన్న కారణంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన ఊరడి మమత అనే యువతి, స్థానిక రామయ్యగూడకు చెందిన నవీన్ లు రెండేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో మమత తండ్రి తనకు మూడు తులాల బంగారం కానుకగా ఇస్తానని చెప్పాడు. తన పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నా తనకు బంగారం పెట్టకపోవడంతో ఇదే విషయం గురించి తన తల్లిదండ్రులను నిలదీసింది.
ఈ క్రమంలోనే మమత తండ్రి.. తన ఆరోగ్యం బాగాలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కానీ ఆలస్యం అయినా బంగారాన్ని కచ్చితంగా పెడతానని, అందుకు కొంత సమయం కావాలని కోరాడు. దీంతో తమ తల్లిదండ్రులు బంగారం ఇవ్వడం లేదని చెప్పి ఎంతో మనస్థాపానికి గురైన మమత విషపు గుళికలను మింగింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ మమత మృతి చెందిందని.. వైద్యులు తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…