ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కు బానిసలవుతున్నారు. ఒక నిమిషం చేతిలో సెల్ లేకపోతే ఏ మాత్రం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కరోనా వల్ల చాలా మంది పిల్లలు సెల్ ఫోన్లకి మరింత ఎక్కువగా బానిసలు అయ్యారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒకే సెల్ ఫోన్ కోసం అక్క, తమ్ముడు పోట్లాడుతున్న సమయంలో తల్లిదండ్రులు తమ కూతురిని వారించారు. దీంతో ఆ బాలిక మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్ర ముంబైలోని కాందివలి తూర్పు జనపౌడలో బాధిత కుటుంబం నివాసముంటోంది. ఈ క్రమంలోనే 16 సంవత్సరాల బాలిక సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చుంది. అదే సమయంలో తన సోదరుడు కూడా అదే ఫోన్ లో గేమ్ ఆడాలని భావించి సెల్ ఫోన్ కోసం గొడవ పడ్డారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో తన తల్లి వచ్చి కూతురిని వారించింది. దీంతో ఆ బాలిక ఎంతో మానసిక వేదనకు గురైంది.
ఈ క్రమంలోనే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి ఎలుకల మందు కొనుగోలు చేసి.. తన తల్లిదండ్రులు తనను తిట్టారన్న కోపంతో ఎలుకల మందును తిన్నది. ఆరోజు రాత్రి తమ కూతురు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడంతో వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విధంగా చికిత్స తీసుకుంటున్న బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మరుసటి రోజు మృతి చెందింది. దీంతో ఆమె కుటంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలా ఒక సెల్ఫోన్ ఆ బాలిక ప్రాణాలు తీసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…