ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కు బానిసలవుతున్నారు. ఒక నిమిషం చేతిలో సెల్ లేకపోతే ఏ మాత్రం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కరోనా వల్ల చాలా మంది పిల్లలు సెల్ ఫోన్లకి మరింత ఎక్కువగా బానిసలు అయ్యారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒకే సెల్ ఫోన్ కోసం అక్క, తమ్ముడు పోట్లాడుతున్న సమయంలో తల్లిదండ్రులు తమ కూతురిని వారించారు. దీంతో ఆ బాలిక మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్ర ముంబైలోని కాందివలి తూర్పు జనపౌడలో బాధిత కుటుంబం నివాసముంటోంది. ఈ క్రమంలోనే 16 సంవత్సరాల బాలిక సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చుంది. అదే సమయంలో తన సోదరుడు కూడా అదే ఫోన్ లో గేమ్ ఆడాలని భావించి సెల్ ఫోన్ కోసం గొడవ పడ్డారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో తన తల్లి వచ్చి కూతురిని వారించింది. దీంతో ఆ బాలిక ఎంతో మానసిక వేదనకు గురైంది.
ఈ క్రమంలోనే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లి ఎలుకల మందు కొనుగోలు చేసి.. తన తల్లిదండ్రులు తనను తిట్టారన్న కోపంతో ఎలుకల మందును తిన్నది. ఆరోజు రాత్రి తమ కూతురు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడంతో వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విధంగా చికిత్స తీసుకుంటున్న బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మరుసటి రోజు మృతి చెందింది. దీంతో ఆమె కుటంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలా ఒక సెల్ఫోన్ ఆ బాలిక ప్రాణాలు తీసింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…