సాధారణంగా కన్న కూతురికి తన తండ్రి ఆసరా ఎంతో ఉంటుంది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తండ్రి తన బిడ్డకు ఏం కష్టం రాకుండా చూసుకుంటాడు. అయితే మెదక్ జిల్లాలో ఓ కన్నబిడ్డకు తండ్రి నుంచి ఒక అమానుష ఘటన ఎదురయింది. అభం శుభం తెలియని చిన్నారి పట్ల ఆ రాక్షస తండ్రి ప్రవర్తించిన తీరు అందరిని కలచి వేస్తోంది. ఫుల్లుగా మద్యం తాగిన మత్తులో తన కూతురి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఓ తండ్రి చంటి బిడ్డను గొడ్డును బాదినట్టు బాదిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తికి వివాహం జరిగి నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. అయితే తన భార్య మరణించడంతో నాగరాజు రెండవ వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన నాగరాజు సోమవారం ఫుల్ గా తాగి ఇంటికి వచ్చాడు. అదే సమయంలో పినతల్లి తన కూతురికి అన్నం తినిపిస్తూ ఉంది.
చిన్నారి అన్నం తిననని మారాం చేయడంతో నాగరాజు మద్యం మత్తులో ఉండి ఎంతో ఆగ్రహానికి గురయ్యాడు. తన కూతురు అన్నం తిననని మారాం చేయడంతో ఏకంగా ఒక తాడు తీసుకొని చిన్న పిల్ల అని కూడా చూడకుండా తనపట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించాడు. అలాగే తనని చేత్తో గాల్లోకి లేపి ఒక్కసారిగా కిందకేసి కొట్టాడు. తన భర్త కూతురి పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ పినతల్లి అక్కడే కూర్చొని ఈ ఘటన చూస్తూ ఉండటం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు ఆ తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…